Nomula Bhagath: ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణస్వీకారం

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 12 Oct 2022 14:35 IST

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపతి కార్యాలయంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భగత్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు భగత్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. తెరాస అభ్యర్థిగా బరిలోకి దిగిన నోముల తనయుడు భగత్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై 18వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని