AP News: జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన తెదేపా బృందం

గుంటూరులో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి

Updated : 24 Aug 2021 11:46 IST

విజయవాడ: గుంటూరులో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై విచారణ జరపడానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్‌ను తెదేపా బృందం కలిసింది. రమ్య హత్య విషయమై సీనియర్‌ నేతలు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, శ్రావణ్‌కుమార్‌ కమిషన్‌ అధికారులను విజయవాడలో కలిశారు. ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులను వారికి వివరించారు. ఈ ఘటనలపై సవివరంగా వింటామన్న కమిషన్‌.. సాయంత్రం 5.30 గంటలకు తెదేపా నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అనంతరం కమిషన్ బృందం గుంటూరు బయల్దేరింది.

అంతకముందు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందానికి పలువురు ప్రముఖులు స్వాగతం పలికారు. నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, గన్నవరం డీటీ శ్రీనివాసరావు, భాజపా ముఖ్య నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని