వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదు: షర్మిల
దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు...
హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని చెప్పారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని చెప్పారు.
జగన్పై అలిగి పార్టీ పెట్టాననడం సరికాదు..
‘‘ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమ లేనట్లేనా? తెలంగాణకు వ్యతిరేకమని నేనెప్పుడూ చెప్పలేదు. సీఎం కేసీఆర్ మహిళలకు విలువ ఇవ్వరు. తెరాసలో మహిళలకు గౌరవం ఉండదు. మహిళలంటే వ్రతాలే చేసుకోవాలని కేటీఆర్ అంటున్నారు.. నిరుద్యోగుల కోసం నేను వ్రతమే చేస్తున్నా. ఏపీ సీఎం జగన్పై అలిగి నేను పార్టీ పెట్టాననడం సరికాదు. అలిగితే మాట్లాడటం మానేస్తారు.. పార్టీలు పెట్టరు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరగబడతారు. జగన్, నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మా పరిధులకు కట్టుబడి ఉన్నాం.
సీఎంగా కేసీఆర్ విఫలం
కేసీఆర్ ఒక నియంత.. ఎవరూ ప్రశ్నించొద్దని అనుకుంటారు. ఆయన పాలనలో జనం ఇబ్బందులు చూడలేక.. ప్రజల బాగోగుల కోసమే పార్టీ పెట్టా. సీఎంగా కేసీఆర్ విఫలమయ్యారు. వచ్చిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేశారు. ఉద్యమకారుడిగా కేసీఆర్పై నాకెంతో గౌరవం ఉంది.. సీఎం అయ్యాక ఆయనలోని దొర బయటకొచ్చారు. పార్టీ అంటే వ్యక్తికాదు.. ప్రజలు, వ్యవస్థ. నేను ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. ఒంటరినని భయపడను.. బాధ లేదు. రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం. హుజూరాబాద్ ఉపఎన్నికకు అర్థమే లేదు. ఈ ఎన్నికతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? పగలు, ప్రతీకారాల కోసం ఉపఎన్నిక వచ్చింది. వైఎస్లాగే నేను కూడా చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభిస్తా’’ అని షర్మిల చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి