TS News: తుర్కపల్లి తెరాస అధ్యక్షుడి ఎన్నికల్లో ఉద్రిక్తత.. కుర్చీలు, కారు అద్దాలు ధ్వంసం!

యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల తెరాస అధ్యక్షుడి ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌.....

Updated : 30 Sep 2022 14:46 IST

యాదాద్రి: యాదాద్రి-భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల తెరాస అధ్యక్షుడి ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి కారుపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మండల అధ్యక్షుడి ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వర్గం ఆగ్రహంవ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో ఆయన కారు అద్దాలతో పాటు సమావేశం జరిగిన ఫంక్షన్‌హాలులో కుర్చీలు ధ్వంసమయ్యాయి.  దీంతో పోలీసుల భద్రత నడుమ గొంగిడి మహేందర్‌ రెడ్డి  అక్కడినుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని