Congress: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తుపై ఇవాళ స్పష్టత రానుంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం.
తొలి జాబితా ప్రకారం.. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్ను డిమాండ్ చేసినప్పటికీ.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ ఆ స్థానం కేటాయించారు. అలాగే మధ్యప్రదేశ్లో 144 మందితో, ఛత్తీస్గడ్ 30 మందితో మొదటి జాబితాలను కాంగ్రెస్ వెల్లడించింది.
కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
- బెల్లంపల్లి (ఎస్సీ) - గడ్డం వినోద్
- మంచిర్యాల - ప్రేమ్సాగర్ రావు
- నిర్మల్ - శ్రీహరి రావు
- ఆర్మూర్ - ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
- బోధన్ - సుదర్శన్ రెడ్డి
- బాల్కొండ - సునీల్ కుమార్ ముత్యాల
- జగిత్యాల - జీవన్ రెడ్డి
- ధర్మపురి (ఎస్సీ) - లక్ష్మణ్ కుమార్
- రామగుండం - రాజ్ ఠాకూర్
- మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- పెద్దపల్లి - చింతకుంట విజయ్ రమణారావు
- వేములవాడ - ఆది శ్రీనివాస్
- మానకొండూరు (ఎస్సీ) - కవ్వంపల్లి సత్యనారాయణ
- మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు
- అందోల్ (ఎస్సీ) - దామోదర రాజనర్సింహ
- జహీరాబాద్ (ఎస్సీ) - ఆగం చంద్రశేఖర్
- సంగారెడ్డి - జగ్గారెడ్డి
- గజ్వేల్ - తూముకుంట నర్సారెడ్డి
- మేడ్చల్ - తోటకూర వజ్రేశ్ యాదవ్
- మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
- కుత్బుల్లాపూర్ - కొలన్ హన్మంత్ రెడ్డి
- ఉప్పల్ - పరమేశ్వర్ రెడ్డి
- చెవేళ్ల (ఎస్సీ) - భీమ్భరత్
- పరిగి - టి. రామ్మోహన్ రెడ్డి
- వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
- ముషీరాబాద్ - అంజన్కుమార్ యాదవ్
- మలక్పేట - షేక్ అక్బర్
- సనత్నగర్ - కోట నీలిమ
- నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
- కార్వాన్ - ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్హజ్రి
- గోషామహల్ - మొగిలి సునీత
- చాంద్రయణగుట్ట - బోయ నగేశ్ (నరేశ్)
- యాకత్పుర - కె. రవి రాజు
- బహదూర్పుర - రాజేశ్ కుమార్ పులిపాటి
- సికింద్రాబాద్ - ఎ.సంతోష్ కుమార్
- కొడంగల్ - రేవంత్ రెడ్డి
- గద్వాల - సరితా తిరుపతయ్య
- అలంపూర్ (ఎస్సీ)- సంపత్ కుమార్
- నాగర్కర్నూల్ - కె. రాజేశ్ రెడ్డి
- అచ్చంపేట్(ఎస్సీ) - సీహెచ్ వంశీకృష్ణ
- కల్వకుర్తి - కసిరెడ్డి నారాయణ్ రెడ్డి
- షాద్ నగర్ - కె. శంకరయ్య
- కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
- నాగార్జున సాగర్ - కుందూరు జయవీర్
- హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్రెడ్డి
- కోదాడ - పద్మావతి రెడ్డి
- నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- నకిరేకల్ (ఎస్సీ)- వేముల వీరేశం
- ఆలేరు - బీర్ల ఐలయ్య
- స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) - సింగాపురం ఇందిర
- నర్సంపేట - దొంతి మాధవ్ రెడ్డి
- భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ రావు
- ములుగు (ఎస్టీ) - సీతక్క
- మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క
- భద్రాచలం - పొదెం వీరయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు