Rajasthan: పైలట్ పాదయాత్ర షురూ.. సీఎం గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్తో విభేదాల వేళ.. అవినీతికి, పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం పాదయాత్ర ప్రారంభించారు. అయితే, వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని వేరే ఓ కార్యక్రమంలో సీఎం గహ్లోత్ వ్యాఖ్యానించారు
జైపుర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో.. రాజస్థాన్ (Rajasthan)లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot)ల మధ్య విభేదాలు మరోసారి రాజుకున్నాయి. మాజీ సీఎం వసుంధర రాజే (Vasundhara Raje) తన ప్రభుత్వాన్ని కాపాడారంటూ ఇటీవల గహ్లోత్ వ్యాఖ్యానించగా.. ఆమెను గహ్లోత్ తన నాయకురాలిగా భావిస్తున్నారని పైలట్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమే.. అవినీతికి, రాష్ట్రంలో పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా పైలట్ గురువారం అజ్మేర్ నుంచి జైపుర్ వరకు ‘జన సంఘర్ష యాత్ర (Jan Sangharsh Yatra)’ పేరిట పాదయాత్రను ప్రారంభించారు. తన యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం సమస్యలపైనేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అయితే.. వర్గ విభేదాలను సృష్టించేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని, పార్టీకి విధేయులుగా ఉండలేరని వేరే ఓ కార్యక్రమంలో సీఎం గహ్లోత్ వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యంలో అందరిని కలుపుకొని పోయేవారు సక్సెస్ అవుతారు. విధేయత, నిజాయతీ, నిబద్ధతలతో కాంగ్రెస్ పార్టీ విధానాలను నిలబెట్టేందుకు శ్రమించా. కానీ, వర్గ రాజకీయాల్లో మునిగితేలేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. వారు పార్టీకి ఎప్పుడూ విధేయులు కారు. విధేయత చాలా ముఖ్యం’ అని జైపుర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గహ్లోత్ మాట్లాడారు. కొంతమంది నేతలతో తనకు విభేదాలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్కు చెందిన వారన్న కారణంతో తన మంత్రివర్గంలో చోటుకల్పించినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే, 45 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని.. ప్రత్యర్థులు కూడా తమ విధేయతను, చిత్తశుద్ధిని ప్రశ్నించలేదని పైలట్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..