CPM-Congress: సీపీఎంతో పొత్తుకు చివరి వరకు ప్రయత్నిస్తాం: కాంగ్రెస్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అందుకే మిర్యాలగూడ, వైరా స్థానాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇప్పటికే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోసం పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలో ఆ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పొత్తుల్లేకుండానే బరిలోకి దిగుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల ప్రకటించారు. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. 14 స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు.. సీపీఎం రెండో జాబితా విడుదల
తాజా పరిస్థితుల నేపథ్యంలో చివరి వరకు సీపీఎంతో పొత్తుకోసం ప్రయత్నిస్తామని కాంగ్రెస్ వెల్లడించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ వైఖరిపై వీరభద్రం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం, పాలేరు, వైరా స్థానాలను ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ నిరాకరించిందని, వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పిందని ఆయన అన్నారు. ఆ తర్వాత వైరా కూడా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తూ.. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్లో ఓ స్థానాన్ని ఇస్తామని చెప్పారని ఈ క్రమంలోనే వాళ్లతో పొత్తు పెట్టుకోవడం లేదని మీడియాకు తెలిపారు. ఒకవేళ మిర్యాలగూడ, వైరా స్థానాలను కేటాయిస్తే.. సీపీఎం పొత్తుకు సిద్ధమవుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?