Ts Elections: అసెంబ్లీ ఎన్నికలు.. సీపీఎం రెండో జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం ప్రకటించింది.

Updated : 06 Nov 2023 22:20 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను సీపీఎం ప్రకటించింది. ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మల్లు లక్ష్మి, నల్గొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు.

సీపీఎంతో పొత్తుకు చివరి వరకు ప్రయత్నిస్తాం: కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సీపీఎం ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో సానుకూల స్పందన రాకపోవడంతో 17 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు సీపీఎం ప్రకటించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని