Stalin: మోదీపై అమిత్ షా కోపంగా ఉన్నారా?: స్టాలిన్
ప్రధాని మోదీ (PM Modi)పై అమిత్ షా (Amit shah)కు కోపం వచ్చినట్లుందని అంటున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమిళ పీఎం రావాలని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించారిలా..!
చెన్నై: తమిళనాడు (Tamil nadu) పర్యటన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) గట్టి కౌంటర్ ఇచ్చారు. తమిళ ప్రధాని ఉండాలంటూ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్.. ‘‘ప్రధాని మోదీ (PM Modi)పై అమిత్ షాకు ఎందుకంత కోపం?’’ అని ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే..
ఆదివారం తమిళనాడులో పర్యటించిన అమిత్ షా (Amit shah).. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు తమిళ రాష్ట్రానికి చెందిన ఎవరికీ ప్రధాని అయ్యే అవకాశం రాకపోవడం విచారకరం. భవిష్యత్తులో ఇక్కడి నుంచి ఓ ప్రధాని (Tamilian PM) రావాలని కోరుకుంటున్నా. ఇందుకోసం కార్యకర్తలంతా గట్టిగా కృషి చేయాలి’’ అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ (Stalin) సోమవారం స్పందించారు. ‘‘అమిత్ షా సలహాను నేను స్వాగతిస్తున్నా. అయితే, ఆయనకు ప్రధాని మోదీపై ఎందుకు కోపమొచ్చిందో..?’’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘ఒకవేళ తమిళ వ్యక్తిని ప్రధానిని చేయాలనుకుంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్. మురుగన్ (కేంద్రమంత్రి) వంటివారున్నారు. ప్రధాని అభ్యర్థులుగా వారికి అవకాశాలు రావొచ్చు’’ అని స్టాలిన్ వివరించారు.
ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా (Amit shah) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 నియోజకవర్గాల్లో సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కాషాయ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక, వెల్లూరులో జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్, డీఎంకేపై విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీలు వారసత్వ రాజకీయాలు, అవినీతికి పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్