Himanta Biswa Sarma: అన్ని మదర్సాలూ మూసేస్తాం.. అస్సాం సీఎం వ్యాఖ్యలు
Himanta Biswa Sarma on madrasas: అస్సాంలో ఉన్న మదర్సాలన్నింటినీ మూసివేయాలని తాను అనుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు.
బెళగావి: అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఉన్న మదర్సాలన్నింటినీ (madrasas) పూర్తిగా మూసివేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘నవ భారతం’లో మదర్సాలు అవసరం లేదన్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం రాత్రి జరిగిన ఓ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు ఎక్కువ మంది వలస వస్తుంటారని, దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతోందని చెప్పారు. ‘‘ఇటీవల దిల్లీలో ఓ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ.. అస్సాంలో ఉన్న 600 మదర్సాలను మూసేయాలనుకుంటున్నట్లు చెప్పాను. వాస్తవంలో అన్ని మదర్సాలనూ మూసివేయాలన్నదే నా ఉద్దేశం’’ అని హిమంత అన్నారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయడానికి స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలి తప్ప మదర్సాల అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరించి, అసత్యాలతో నింపేశారని హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు హిందూయిజాన్ని నాశనం చేయాలని చూస్తే.. ఛత్రపతి శివాజీ మాత్రం సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను రక్షించారన్నారు. దేశం మొత్తాన్ని ఔరంగ జేబు పాలించాడని కమ్యూనిస్టు చరిత్రకారులు రాశారని, వాస్తవంలో ఈశాన్య, దక్షిణ భారత రాష్ట్రాలు ఎప్పుడూ ఆయన పాలనలో లేవని చెప్పారు. ఇలా వక్రీకరణకు గురైన చరిత్రను తిరగ రాలయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఔరంగజేబు కంటే శివాజీ శక్తిమంతుడు అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తులు చేసిన పనే ఇప్పటి కాంగ్రెస్ చేస్తోందని, దేశాన్ని బలహీన పరుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ‘కొత్త మొఘలులు’గా అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..