Yadlapati: పార్టీ మారాలని ఎన్టీఆర్ చెప్పలేదు కదా.. అంగీకరించండి..!
సోమవారం ఉదయం కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. న్యాయవాదిగా, రైతు నేతగా, ప్రజాప్రతినిధిగా.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన సేవలందించారు. ప్రముఖ రైతు...
అమరావతి: సోమవారం ఉదయం కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడిపారు. న్యాయవాదిగా, రైతు నేతగా, ప్రజాప్రతినిధిగా.. ఇలా ఎన్నో విధాలుగా ఆయన సేవలందించారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగానూ కొనసాగారు. కృషికార్ లోక్పార్టీ ఏర్పాటు సమయంలో యడ్లపాటి వెంకట్రావు కీలకంగా వ్యవహరించారు. యడ్లపాటి మృతి నేపథ్యంలో ఆయన అందించిన సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2019లో ఈటీవీలో ప్రసారమైన ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో యడ్లపాటి వెంకట్రావు తన జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానాన్ని పంచుకున్నారు.
స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్, తెదేపాల్లో రాజకీయ ప్రస్థానం.. అప్పటి పరిస్థితులను యడ్లపాటి వివరించారు. తాను చేసిన రైతు పోరాటాలు.. అప్పటి సీఎం ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలు.. ముఖ్యంగా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతుల కోసం ‘కర్షక పరిషత్’ ఏర్పాటు సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. 1983లో తెదేపా అధికారంలోకి వచ్చేనాటికి తాను కాంగ్రెస్లో ఉన్నానని.. కర్షక పరిషత్లో చేరమని ఎన్టీఆర్ కోరితే తొలుత తాను తిరస్కరించానని చెప్పారు. నైతిక విలువలు ఉన్న వ్యక్తినని.. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి చెందిన ప్రభుత్వంలోని పదవులు వద్దని చెప్పానన్నారు. ఈ విషయంపై ఎన్టీఆర్కు లేఖ కూడా రాశానని తెలిపారు. అయితే ఎన్టీఆర్ కూడా తిరిగి ఏడు పేజీల లేఖను తనకు పంపారన్నారు. ఈ రోజుల్లోనూ విలువలకు కట్టుబడి ఉన్న మనుషులు ఉండటం అరుదు అని ఎన్టీఆర్ అందులో పేర్కొన్నారని చెప్పారు. కాంగ్రెస్లో కొనసాగుతున్నా పర్లేదని.. నైతిక విలువలు, వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్న తనకు అవకాశమిస్తానంటూ కర్షక పరిషత్లో చేరమని ఎన్టీఆర్ తనను కోరారని యడ్లపాటి వివరించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత బలరామ్ జాకడ్ దృష్టికి తీసుకెళితే ‘పార్టీ మారాలని ఎన్టీఆర్ చెప్పలేదు కదా.. అంగీకరించండి’ అని తనకు సూచించారని చెప్పారు. ఆ విధంగా తాను అంగీకరిస్తేనే కర్షక పరిషత్లో సభ్యుడిగా చేరానని వివరించారు.
1983 ఎన్నికల్లో తాను, చంద్రబాబు కాంగ్రెస్ నుంచే పోటీ చేశామని యడ్లపాటి వెంకట్రావు పేర్కొన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో ఆయనకు ఒకసారి బీఫామ్ తానే ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని రంగా భవన్లో సమావేశం జరుగుతుండగా చిత్తూరుకు చెందిన రాజగోపాలనాయుడు చంద్రబాబును అక్కడికి తీసుకొచ్చారని చెప్పారు. యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ అని.. ఎమ్మెల్యే సీటిస్తే బాగుంటుందని ఆయన చెప్పారన్నారు. అలా ఆయన సూచన మేరకు తన చేతుల మీదుగానే చంద్రబాబుకు బీఫామ్ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఇలా ఎన్నో విషయాలను ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో యడ్లపాటి వెంకట్రావు పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!