Yanamala Rama Krishnudu: వాళ్లకి ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత : యనమల

సొంత చెల్లెలికే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిలదీశారు.

Published : 08 Mar 2024 15:26 IST

విజయవాడ: సొంత సోదరికే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిలదీశారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత అని అన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘జగన్ రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయి. జగన్‌ 420 అని నిన్న వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అతడి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా? సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు? మహిళా సాధికారత తెదేపాతోనే సాధ్యం. మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు తెదేపానే కల్పించింది’ అని యనమల గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని