AP Politics: తెదేపా నేతలపై రాష్ట్రపతికి వైకాపా ఫిర్యాదు

తెదేపా నేతలపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ లక్ష్యంగా తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలను వివరించినట్టు రాష్ట్రపతితో

Updated : 02 Nov 2021 18:30 IST

దిల్లీ: తెదేపా నేతలపై వైకాపా ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌ లక్ష్యంగా తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలను వివరించినట్టు రాష్ట్రపతితో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తప్పుచేసి దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే ఆయన దిల్లీకి వచ్చారని ఆరోపించారు. రాజ్యాంగ పదవులను కించపరిచేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకొనేలా చట్టం తేవాలని, ఇందుకు తగిన సూచనలు చేయాలని రాష్ట్రపతిని కోరినట్టు విజయసాయి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని