IND vs ENG:బుమ్రా, ఉమేశ్ యాదవ్లాగా అతడు వికెట్లు పడగొట్టలేడు: మైకెల్ హోల్డింగ్
టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేయడని వెస్టిండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్లాగా అతడు వికెట్లు పడగొట్టలేడని
(Photo:Shardul Thakur Twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేయకపోవచ్చని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్లాగా అతడు వికెట్లు పడగొట్టలేడని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్.. చివరికి 290 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత భారత బౌలర్లు విజృంభించినా.. తర్వాత తేలిపోయారు. దీంతో ఇంగ్లాండ్ మంచి పరుగులు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే మైకెల్ హోల్డింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.‘ఇంగ్లాండ్ ఆటగాళ్లపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. శార్దూల్ బౌలింగ్ చేసినా బుమ్రా, ఉమేశ్ యాదవ్ లాగా వికెట్లు తీయలేకపోయాడు. ఇంగ్లాండ్ పిచ్లపై అతడు ప్రభావం చూపలేడు. చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బుమ్రా, ఉమేశ్ ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు’అని మైకెల్ హోల్డింగ్ వివరించారు. అయితే, శార్దూల్ తొలి ఇన్నింగ్స్లో.. బంతితో అంతగా రాణించనప్పటికీ.. బ్యాట్తో మాత్రం రాణించాడు. కేవలం 36 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు స్కోరు 191 పరుగులకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ మంత్రి
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా