ధోనీకి కరోనా పరీక్షలు.. ఫలితం ఎప్పుడంటే..
టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బుధవారం కరోనా వైరస్ పరీక్షలు చేసుకున్నాడు. రాంచీలోని స్థానిక గురునానక్ ఆస్పత్రి...
తన నైపుణ్యాలతో అబ్బురపరుస్తాడు: షేన్వాట్సన్
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బుధవారం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. రాంచీలోని స్థానిక గురునానక్ ఆస్పత్రి వర్గాలు అతడి నుంచి నమూనాలు సేకరించాయి. వాటి ఫలితాలు ఈరోజు సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ధోనీతో పాటు మరో చెన్నై ఆటగాడు మోను కుమార్ సింగ్ సైతం ఈ పరీక్షలు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఫలితాల్లో వారిద్దరికీ నెగిటివ్ రాగానే చెన్నై బయలు దేరి వెళ్లనున్నారు. ఆగస్టు 15 నుంచి 20 తేదీల మధ్య సీఎస్కే ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫిట్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆ జట్టు సీఈవో విశ్వనాథన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచే 21న ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లనున్నాడు. అయితే, ఐపీఎల్ ఆటగాళ్లు ఎవరైనా అక్కడికి వెళ్లే ముందు రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాలి. అలాగే అక్కడికి వెళ్లాక కూడా పలుమార్లు టెస్టులు చేస్తారనే విషయాలు తెలిసినవే.
మరోవైపు ధోనీపై సీఎస్కే ఆటగాడు షేన్వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ టీమ్ఇండియా మాజీ సారథి వయసుపైబడిన వాడిలా కనిపించడని చెప్పాడు. మహీకి ఇంకా ఆడాలని ఉందని, అతనెప్పుడూ ఎవర్గ్రీన్ ప్లేయర్ అని కొనియాడాడు. అతడు పూర్తిఫిట్నెస్తో ఉంటాడని, తన నైపుణ్యాలతో అబ్బురపరుస్తాడని తెలిపాడు. ఇదిలా ఉండగా, వాట్సన్ ఐపీఎల్లో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. 2008 నుంచి ఆడుతున్న అతడు వేర్వేరు జట్ల తరఫున ఆడినా మంచి ప్రదర్శన చేశాడు. చివరికి 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్న అతడు ఆ ఏడాది దూకుడైన బ్యాటింగ్తో టైటిల్ అందించాడు. అలాగే గతేడాది ముంబయి ఇండియన్స్తో జరిగిన ఫైనల్లోనూ మ్యాచ్ను గెలిపించేంత పని చేశాడు. చివర్లో వాట్సన్(80; 59 బంతుల్లో 8x4, 4x6) రనౌట్ అవ్వడంతో ఆ జట్టు ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!