సిరీస్ చేజిక్కించుకున్న ఇంగ్లాండ్
నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో గెలుపొంది ఇంగ్లండ్ జట్టు సిరీస్ను చేజిక్కించుకుంది. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను..
నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో ఘన విజయం
500 వికెట్ల క్లబ్లో చేరిన స్టువర్ట్ బ్రాడ్
మాంచెస్టర్: నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్లో 269 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. లాక్డౌన్ అనంతరం నిర్వహించిన ఈ మొదటి టెస్టు సిరీస్లోని మొదటి మ్యాచ్ను వెస్టిండీస్ సొంతం చేసుకోగా, రెండో దాంట్లో ఇంగ్లాండ్ గెలుపొందింది.
మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 369 పరుగులు చేయగా పర్యాటక జట్టు 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు కోల్పోయి 226 పరుగులు సాధించిన ఆతిథ్య జట్టు డిక్లేర్ చేసింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్ కనీసం పోరాడకుండా చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వర్షం కారణంగా సోమవారం ఆట నిలిచిపోయినా పర్యాటక జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. క్రిస్ వోక్స్ ఐదు వికెట్లు సాధించగా, బ్రాడ్ నాలుగు వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ మరో ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు కొల్లగొట్టాడు. మూడో టెస్టులో ఓపెనర్ బ్రాత్వైట్ వికెట్ తీసి 500 వికెట్లు పడగొట్టిన ఏడో బౌలర్గా నిలిచాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రాత్వైట్ను ఎల్బీడబ్ల్యూ చేసి బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. 2017లో జేమ్స్ అండర్సన్ తీసుకున్న 500వ వికెట్ కూడా బ్రాత్వైట్దే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్