ప్చ్‌.. ధోనీ సలహాలు మిస్సవుతున్న కోహ్లీసేన!

ప్రస్తుతం భారత జట్టు ఎంఎస్‌ ధోనీ సూచనలు, సలహాలను బాగా కోల్పోతోందని మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరె అన్నారు. అందుకే కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ వంటి యువ స్పిన్నర్లు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. టీమ్‌ఇండియా మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ...

Published : 10 Dec 2020 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం భారత జట్టు ఎంఎస్‌ ధోనీ సూచనలు, సలహాలను బాగా కోల్పోతోందని మాజీ క్రికెటర్‌ కిరణ్‌ మోరె అన్నారు. అందుకే కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ వంటి యువ స్పిన్నర్లు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. టీమ్‌ఇండియా మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌ నిర్వహించిన పొడ్‌క్యాస్ట్‌లో ఆయన మాట్లాడారు.

‘పిచ్‌పై ఏ లెంగ్త్‌, ఏ లైన్‌లో బంతులు వేయాలో ఎంఎస్‌ ధోనీ సూచనలు చేసేవాడు. దాదాపుగా అవి హిందీలో ఉండేవి. ఇప్పుడు వికెట్ల వెనకాల ధోనీ లేడు. అందుకే టీమ్‌ఇండియా స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా ఒకప్పటిలా కనిపించడం లేదు’ అని మోరె అన్నారు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కుల్‌దీప్‌ 57 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. చాహల్‌ 1/89, 0/71తో పేలవ ప్రదర్శన చేశాడు. జడ్డూ సైతం గతంలో మాదిరిగా వికెట్లు తీయడం లేదు.

‘10-12 ఏళ్లు ధోనీ సలహాలు ఇచ్చాడు. విరాట్‌ కోహ్లీ డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కుర్రాళ్లను నడిపించేవాడు. మహీ లేకపోవడంతో బౌలర్లతో మాట్లాడేందుకు కోహ్లీ ఇప్పుడు ఎక్స్‌ట్రా కవర్‌ లేదా మిడాఫ్‌లో ఉంటున్నాడు. ఏదేమైనా మరో ధోనీని కనుక్కోవడం కష్టం. ప్రస్తుతం పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలు వికెట్‌కీపర్లను సారథులుగా ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండేవాడి వల్ల ప్రయోజనం ఉండటమే కారణం’ అని మోరె వెల్లడించాడు.

ఇవీ చదవండి
ఆసీస్‌పై విజయానికి కారణమదే అంటున్న ఆటగాళ్లు
క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని