ప్చ్.. ధోనీ సలహాలు మిస్సవుతున్న కోహ్లీసేన!
ప్రస్తుతం భారత జట్టు ఎంఎస్ ధోనీ సూచనలు, సలహాలను బాగా కోల్పోతోందని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె అన్నారు. అందుకే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి యువ స్పిన్నర్లు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. టీమ్ఇండియా మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ...
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత జట్టు ఎంఎస్ ధోనీ సూచనలు, సలహాలను బాగా కోల్పోతోందని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె అన్నారు. అందుకే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి యువ స్పిన్నర్లు విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. టీమ్ఇండియా మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్ నిర్వహించిన పొడ్క్యాస్ట్లో ఆయన మాట్లాడారు.
‘పిచ్పై ఏ లెంగ్త్, ఏ లైన్లో బంతులు వేయాలో ఎంఎస్ ధోనీ సూచనలు చేసేవాడు. దాదాపుగా అవి హిందీలో ఉండేవి. ఇప్పుడు వికెట్ల వెనకాల ధోనీ లేడు. అందుకే టీమ్ఇండియా స్పిన్నర్లు ఇబ్బంది పడుతున్నారు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఒకప్పటిలా కనిపించడం లేదు’ అని మోరె అన్నారు. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ 57 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చాహల్ 1/89, 0/71తో పేలవ ప్రదర్శన చేశాడు. జడ్డూ సైతం గతంలో మాదిరిగా వికెట్లు తీయడం లేదు.
‘10-12 ఏళ్లు ధోనీ సలహాలు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ డీప్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కుర్రాళ్లను నడిపించేవాడు. మహీ లేకపోవడంతో బౌలర్లతో మాట్లాడేందుకు కోహ్లీ ఇప్పుడు ఎక్స్ట్రా కవర్ లేదా మిడాఫ్లో ఉంటున్నాడు. ఏదేమైనా మరో ధోనీని కనుక్కోవడం కష్టం. ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు వికెట్కీపర్లను సారథులుగా ఎంచుకుంటున్నాయి. ఎందుకంటే వికెట్ల వెనకాల ఉండేవాడి వల్ల ప్రయోజనం ఉండటమే కారణం’ అని మోరె వెల్లడించాడు.
ఇవీ చదవండి
ఆసీస్పై విజయానికి కారణమదే అంటున్న ఆటగాళ్లు
క్రికెట్కు పార్థివ్ పటేల్ గుడ్బై
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!