రిటైరైన దిగ్గజాల కోసం.. ఇర్ఫాన్ ఏమన్నాడంటే?
గత దశాబ్దంలో ఎంతో మంది టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రిటైరయ్యారు. విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ మొదలు కొని ఇటీవల మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ వరకు చాలా...
ధోనీ సేన vs కోహ్లీ సేన ఛారిటీ మ్యాచ్ ?
ఇంటర్నెట్డెస్క్: గత దశాబ్దంలో ఎంతో మంది టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రిటైరయ్యారు. విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ మొదలుకొని ఇటీవల మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ వరకు చాలా మంది ఆటకు విశ్రాంతి ప్రకటించారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మినహా మిగతావారంతా సరైన వీడ్కోలు మ్యాచ్ ఆడలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే అయినా కాదనేలేని వాస్తవం. మరోవైపు చాలా మంది క్రికెటర్లు ఈ విషయంపై మనోవేదనకు కూడా గురయ్యారు. కొందరు బయటకి చెప్పకపోయినా సన్నిహితుల వద్ద వాపోయారు. ఇదే విషయంపై యువరాజ్ సింగ్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాక మీడియా ఎదుట బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
2011 వన్డే ప్రపంచకప్ తర్వాత మెల్లిమెల్లిగా సీనియర్లను దూరం పెట్టడంతో చాలా మంది వైదొలగారు. అలా గంభీర్, సెహ్వాగ్, ద్రవిడ్, లక్ష్మణ్, యువీ, రైనా, ఇర్ఫాన్, జహీర్లాంటి దిగ్గజాలు ఫేర్వెల్ మ్యాచ్లు ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించారు. తమ అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన వీరిని గౌరవప్రదంగా సాగనంపలేదనే బాధ అభిమానుల్లోనూ కొంత ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఇప్పటికే రిటైరైన ఆ దిగ్గజాలతో.. ప్రస్తుత కోహ్లీ సేనకు ఓ ఛారిటి మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని అభిమానులను అడిగాడు. అది వారికి ఫేర్వెల్ మ్యాచ్లాగానూ అనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం రిటైరైన ఆటగాళ్లతో ఒక జట్టును కూడా రూపొందించాడు.
రిటైర్మెంట్ టీమ్ ఆటగాళ్లు:
గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, జహీర్ఖాన్, ప్రగ్యాన్ ఓజా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ