ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
ఇప్పుడంతా టీ20 లీగ్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 (SA T20) లీగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మిస్టర్ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పలు కీలక విషయాలపై మాట్లాడాడు. ఏబీడీ ఐపీఎల్లోనూ (IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఏబీ డివిలియర్స్ కేవలం దక్షిణాఫ్రికా ఆటగాడిగానే కాకుండా.. ఐపీఎల్లోనూ అదరగొట్టేయడంతో భారత అభిమానులకూ సుపరిచితుడు. మైదానం నలువైపులా క్రికెటింగ్ షాట్లను కొట్టే ఏబీడీని అంతా ‘మిస్టర్ 360’గా పిలుస్తారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏబీడీ గతేడాది లీగ్లకూ గుడ్బై చెప్పేశాడు. ఈ క్రమంలో క్రికెట్ షెడ్యూలింగ్కు సంబంధించి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్లు రావడంతో ఆటగాళ్లు ఫార్మాట్లను ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు పలకడంపై ఎదురైన ప్రశ్నకు డివిలియర్స్ స్పందించాడు.
‘‘మంచి ఫామ్లో ఉన్న బెన్స్టోక్స్ అలా వన్డే ఫార్మాట్ను వదిలేయడానికి కూడా క్రికెట్ షెడ్యూలింగ్ కారణం అయి ఉంటుంది. విపరీతమైన బిజీ షెడ్యూల్తో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బంది పడతారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే సమస్య ఉంది. అయితే క్రికెటర్లను తమ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడేలా స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత ఆయా క్రికెట్ బోర్డులపై ఉంటుంది. అందుకే తొలుత ఆటగాళ్లతో మాట్లాడాలి. ఏం సాధించాలని అనుకుంటున్నారు..? వారు ఏ ఫార్మాట్కు సరిపోతారు..? అనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. మొదట దేశం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత లీగుల్లో ఆడటంపై ఏమాత్రం అభ్యంతరం ఉండదు. అయితే దీనికోసం బోర్డు, ఆటగాళ్లు పరస్పరం చర్చించుకోవాలి’’
‘‘విదేశాల్లో జరిగే లీగుల్లో ఆడితే వచ్చే అనుభవం మెగా టోర్నీల్లో సాయపడుతుంది. తనతోపాటు సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రెవిస్ వంటి క్రికెటర్లు రాణించారు. అదంతా లీగ్లతోనే సాధ్యమైంది. అందుకే మనం ఏం చేయగలమనేదానిపై దృష్టిపెట్టాలి. సదరు ప్లేయర్ ఓ ఫార్మాట్లో ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే స్ఫూర్తి నింపాలి. అలాగే కొనసాగితే మాత్రం అతడితో చర్చించాల్సిన అవసరం ఉంది. నా కెరీర్లో నేను గమనించిన అంశమదే. తరచూ మాట్లాడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో మద్దతుగా నిలిచింది’’ అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు