దూసుకెళ్లిన రోహిత్..టాప్-5లో అశ్విన్
ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇంగ్లాండ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు.....
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇంగ్లాండ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. ఎనిమిది వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్లో శతకం సాధించిన యాష్ ఆల్రౌండర్ జాబితాలో అయిదో స్థానానికి చేరాడు. జేసన్ హోల్డర్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్, బుమ్రా వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కమిన్స్ ఉన్నాడు.
మరోవైపు తొలి ఇన్నింగ్స్లో భారీశతకం సాధించిన హిట్మ్యాన్ బ్యాటింగ్ విభాగంలో టాప్-15లో నిలిచాడు. తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్కు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అయిదో ర్యాంక్లో ఉన్నాడు. నయావాల్ పుజారా ఒక ర్యాంక్ను కోల్పోయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రిషభ్ పంత్ (11) తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ను అందుకున్నాడు. మరోవైపు రెండో టెస్టులో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన ఇంగ్లాండ్ సారథి జో రూట్ నాలుగో ర్యాంక్కు పడిపోయాడు. అగ్రస్థానంలో కేన్ విలియమ్సన్ (919 పాయింట్లు) ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..