చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది.
పంజాబ్పై ఘన విజయం
జడేజా ఆల్రౌండ్ జోరు
రాణించిన సిమర్జీత్, తుషార్
ధర్మశాల
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. 11 మ్యాచ్ల్లో ఆరో గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. బ్యాట్తో జట్టును ఆదుకున్న ఆల్రౌండర్ జడేజా.. బంతితోనూ మాయ చేసి చెన్నైని గెలిపించాడు. తుషార్ దేశ్పాండే, సిమర్జీత్ సింగ్ విజయంలో కీలకమయ్యారు. పంజాబ్కు పదకొండు మ్యాచ్ల్లో ఇది ఏడో ఓటమి.
ఐపీఎల్లో పంజాబ్పై కొన్నేళ్ల తర్వాత ఓ విజయం సాధించింది చెన్నై. పంజాబ్ చేతిలో వరుసగా అయిదు ఓటములు చవిచూసిన సీఎస్కే.. ఆదివారం 28 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించింది. మొదట చెన్నై 167/9కే పరిమితమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (43; 26 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. రాహుల్ చాహర్ (3/23) చెన్నైని కట్టడి చేశాడు. జడేజా (3/20), సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్పాండే (2/35) విజృంభించడంతో ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (30; 23 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.
పంజాబ్ టపటపా..: ఛేదనలో పంజాబ్ తడబడింది. 2 ఓవర్లకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో బెయిర్స్టో (7), రొసో (0)లను ఔట్ చేసిన తుషార్ దేశ్పాండే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్.. శశాంక్ సింగ్ (27)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. ఈ జోడీ మూడో వికెట్కు 53 పరుగులు జత చేయడంతో పంజాబ్ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ శాంట్నర్ (1/10) శశాంక్ ఆట కట్టించి వికెట్ల పతనానికి మళ్లీ గేట్లెత్తాడు. సామ్ కరన్ (7), జితేశ్ శర్మ (0), అశుతోష్ శర్మ (3) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో ఒక దశలో 62/2తో ఉన్న పంజాబ్.. 16 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 78/7తో ఓటమిని ఖాయం చేసుకుంది. మొదట ఓపెనర్ ప్రభ్సిమ్రన్ను పెవిలియన్ చేర్చిన జడేజా.. 13వ ఓవర్లో సామ్ కరన్, అశుతోష్లను ఔట్ చేసి చెన్నై విజయానికి బాటలు వేశాడు. హర్ప్రీత్ బ్రార్ (17 నాటౌట్), హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహార్ (16), రబాడ (11 నాటౌట్) పోరాటం పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
చెన్నై కట్టడి: పవర్ప్లే ఆఖరికి చెన్నై స్కోరు 60/1.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు జోరిది. సీఎస్కే ఊపు చూస్తే భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. కానీ వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడి పెంచుకుని ఆఖరికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. రెండో ఓవర్లోనే రహానె (9) వికెట్ కోల్పోయినా.. చెన్నై మాత్రం తగ్గలేదు. ఫామ్లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ (32; 21 బంతుల్లో 4×4, 1×6), మిచెల్ (30; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ రాహుల్ చాహర్.. రుతురాజ్తో పాటు ప్రమాదకర శివమ్ దూబె (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసి చెన్నైకి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత మిచెల్ను హర్షల్ పటేల్ బుట్టలో వేయడంతో 8.5 ఓవర్లకు 75/4తో చెన్నై కష్టాల్లో పడింది. ఈ స్థితిలో జడేజా నిలిచాడు. మొయిన్ అలీ (17), శాంట్నర్ (11), శార్దూల్ ఠాకూర్ (17) సాయంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. చాలా ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ధోని (0) ఒకే ఒక్క బంతిని ఎదుర్కొని హర్షల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఈ సీజన్లో తొలిసారి ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్లో హైబ్రిడ్ పిచ్ను ఉపయోగించారు.
చెన్నై ఇన్నింగ్స్: రహానె (సి) రబాడ (బి) అర్ష్దీప్ 9; రుతురాజ్ (సి) జితేశ్ (బి) రాహుల్ చాహర్ 32; మిచెల్ ఎల్బీ (బి) హర్షల్ 30; దూబె (సి) జితేశ్ (బి) రాహుల్ చాహర్ 0; అలీ (సి) బెయిర్స్టో (బి) కరన్ 17; జడేజా (సి) కరన్ (బి) అర్ష్దీప్ 43; శాంట్నర్ (సి) కరన్ (బి) రాహుల్ చాహర్ 11; శార్దూల్ (బి) హర్షల్ 17; ధోని (బి) హర్షల్ 0; తుషార్ నాటౌట్ 0; గ్లీసన్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-12, 2-69, 3-69, 4-75, 5-101, 6-122, 7-150, 8-150, 9-164; బౌలింగ్: రబాడ 3-0-24-0; అర్ష్దీప్ 4-0-42-2; సామ్ కరన్ 4-0-34-1; బ్రార్ 1-0-19-0; రాహుల్ చాహర్ 4-0-23-3; హర్షల్ 4-0-24-3
పంజాబ్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (సి) రిజ్వి (బి) జడేజా 30; బెయిర్స్టో (బి) తుషార్ 7; రొసో (బి) తుషార్ 0; శశాంక్ (సి) సిమర్జీత్ (బి) శాంట్నర్ 27; సామ్ కరన్ (సి) శాంట్నర్ (బి) జడేజా 7; జితేశ్ (సి) ధోని (బి) సిమర్జీత్ 0; అశుతోష్ (సి) సిమర్జీత్ (బి) జడేజా 3; బ్రార్ నాటౌట్ 17; హర్షల్ (సి) సమీర్ (బి) సిమర్జీత్ 12; రాహుల్ చాహర్ (బి) శార్దూల్ 16; రబాడ నాటౌట్ 11; ఎక్స్ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-9, 2-9, 3-62, 4-68, 5-69, 6-77, 7-78, 8-90, 9-117; బౌలింగ్: శాంట్నర్ 3-0-10-1; తుషార్ 4-0-35-2; గ్లీసన్ 4-0-41-0; జడేజా 4-0-20-3; సిమర్జీత్ 3-0-16-2; శార్దూల్ 2-0-12-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది. -
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్