AUS vs NZ: ఉత్కంఠ పోరులో ఆసీస్దే విజయం.. రచిన్, నీషమ్ పోరాటం వృథా
వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యఛేదనలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యఛేదనలో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108; 82 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీ వృథా అయింది. డారిల్ మిచెల్ (54; 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం బాదాడు. చివర్లో జేమ్స్ నీషమ్ (58; 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. డేవాన్ కాన్వే (28), విల్ యంగ్ (32), టామ్ లేథమ్ (21), గ్లెన్ ఫిలిప్స్ (12), మిచెల్ శాంట్నర్ (17) భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3, హేజిల్వుడ్ 2, కమిన్స్ 2, మ్యాక్స్వెల్ ఒక వికెట్ తీశారు. ఆసీస్కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. న్యూజిలాండ్కు రెండో ఓటమి.
ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (109: 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించాడు. కేవలం 59 బంతుల్లోనే శతకం బాది ప్రపంచకప్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ (81: 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 175 పరుగులు జోడించారు. అయితే, కివీస్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. కానీ, చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ (41: 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (37: 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు. ఇంగ్లిస్ (38), మిచెల్ మార్ష్ (36) ఫర్వాలేదనిపించారు. స్టీవ్ స్మిత్ (18), మార్నస్ లబుషేన్ (18) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, గ్లెన్ ఫిలిప్స్ 3, మిచెల్ శాంట్నర్ 2.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!