Womens T20 League: మహిళల టీ20 లీగ్.. ఫ్రాంచైజీ బిడ్ కనీస ధర రూ.400 కోట్లు!
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మహిళల భారత టీ20 లీగ్ కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకొంది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని ఇప్పటికే భావించిన బోర్డు.. తాజాగా ఫ్రాంచైజీల కోసం బిడ్లను ఆహ్వానించింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల భారత టీ20 లీగ్ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఐదు జట్లతో లీగ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఐదు ఫ్రాంచైజీల కోసం బీసీసీఐ టెండర్ను పిలిచింది. ఫ్రాంచైజీ కోసం ప్రాథమిక ధర దాదాపు రూ. 400 కోట్లతో (50 మిలియన్ డాలర్లు) బరిలోకి దిగాల్సి ఉంటుంది. తొలిసారి పురుషుల లీగ్ (2007-2008) కోసం ముంబయి ఫ్రాంచైజీకి రూ. 446 కోట్లకు (అప్పుడు డాలర్ విలువ రూ. 40) విక్రయించిన ధరను ప్రామాణికంగా తీసుకొని బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది.
‘‘ప్రస్తుతం క్రికెట్కు ఉన్న మార్కెట్ డిమాండ్, ఆసక్తిని బట్టి బెంచ్మార్క్ను నిర్ణయించాం. ఒక్కో ఫ్రాంచైజీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. దీనివల్ల దాదాపు రూ. 6 నుంచి 7 వేల కోట్ల వరకు బీసీసీఐ ఖజానాకు చేరే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలతో బ్రాండ్కాస్ట్ హక్కులను ఈ-వేలంతో కాకుండా బిడ్ ద్వారానే కేటాయిస్తుంది. జట్టును సొంతం చేసుకొన్న ఫ్రాంచైజీ ఐదేళ్లపాటు యాజమాన్య హక్కుల కోసం ఫీజును బీసీసీఐకి వాయిదాల్లో కట్టే అవకాశం ఉంది. పురుషుల భారత టీ20 లీగ్ మాదిరిగానే ప్రాపర్టీ సొంతమవుతుంది’’ అని బీసీసీఐ అనధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా మహిళా జట్టును సొంతం చేసుకోవచ్చని బీసీసీఐ పేర్కొంది. అర్హతలకు సంబంధించిన అంశాలను ఆచరించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని వివరాలను బీసీసీఐ వదిలేసిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. పురుషుల లీగ్ నుంచి వచ్చిన లాభాలను మహిళా జట్టు కోసం బిడ్లో పాల్గొనే అవకాశం యాజమాన్యాలకు ఉందా..? వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసే కొత్తవారికి లాభాలను ఆర్జించే అవకాశం ఉండాలంటే సుదీర్ఘకాలం లీగ్ను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి కమిట్మెంట్ను బీసీసీఐ ఇస్తుందా..? వంటి అంశాలపై బోర్డు వివరణ ఇవ్వాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..