కోహ్లీసేనే ప్రపంచకప్ ఫేవరెట్.. ఎందుకంటే?
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య జట్టైన టీమ్ఇండియానే ఫేవరెట్ అని ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీసేన బలమైన జట్టన్నాడు. టీ20 ఫార్మాట్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదని పేర్కొన్నాడు. మెగాటోర్నీలో కీలక పాత్ర పోషించే మొతేరాలో ఐదు టీ20లు...
జోస్ బట్లర్ వివరణ ఇదీ
అహ్మదాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య జట్టైన టీమ్ఇండియానే ఫేవరెట్ అని ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీసేన బలమైన జట్టన్నాడు. టీ20 ఫార్మాట్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదని పేర్కొన్నాడు. మెగాటోర్నీలో కీలక పాత్ర పోషించే మొతేరాలో ఐదు టీ20లు ఆడుతుండటం ఇంగ్లాండ్కు లాభిస్తుందని స్పష్టం చేశాడు. అరంగేట్రం పొట్టి ప్రపంచకప్ గెలుచుకున్న భారత్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో టోర్నీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
‘మీరు ఒకసారి ప్రపంచకప్ టోర్నీలను పరిశీలించండి. ఆతిథ్య జట్లు మరింత మెరుగ్గా ఆడుతున్నాయని తెలుస్తుంది. అందుకే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియానే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. బాగా ఆడుతున్న జట్లు ఇంకా ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా మెగాటోర్నీల్లో ఆతిథ్య జట్లు బాగా ఆడటం గమనార్హం. కోహ్లీసేన అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. టీ20ల్లోనూ అంతే’ అని బట్లర్ అన్నాడు.
ప్రస్తుతం మొతేరా వేదికగా టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ఐదు టీ20ల సిరీసులో తలపడుతున్నాయి. ప్రపంచకప్లోనూ ఎక్కువ మ్యాచులు ఇక్కడ జరిగే అవకాశం ఉండటం తమకు లాభిస్తుందని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు.
‘ఇక్కడ బాగా ఆడి సిరీస్ గెలవాలని కోరుకుంటున్నాం. అలా జరిగితే ప్రపంచకప్ ముందు మా బృందంలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. అందుకే ప్రపంచకప్ పరిస్థితుల్లో కోహ్లీసేనతో ఇక్కడ తలపడటం మాకు లభించిన అద్భుత అవకాశం. ఎందుకంటే అహ్మదాబాద్లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మరే జట్టుకూ ఆడే అవకాశం రాలేదు’ అని బట్లర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.