MS Dhoni: కెప్టెన్గా చెన్నైకి 4 టైటిళ్లు అందించిన మహేంద్రుడు
చెన్నై జట్టుకు అపూర్వ విజయాలు అందించిన ఎంఎస్ ధోనీ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. సుదీర్ఘకాలంపాటు చెన్నైకి నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై జట్టుకు అపూర్వ విజయాలు అందించిన ఎంఎస్ ధోనీ మెగా టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. సుదీర్ఘకాలంపాటు చెన్నైకి నాయకత్వం వహించిన మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీంతో చెన్నై యాజమాన్యం తదుపరి సారథిగా రవీంద్ర జడేజాను నియమించింది. అయితే ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఎన్నో మధురమైన విజయాలతో నాలుగు సార్లు ఛాంపియన్గా అవతరించింది. ఆది నుంచి చెన్నై జట్టును ముందుండి నడిపించిన ధోనీ.. ఆ జట్టును విజేతగా నిలబెట్టిన మ్యాచ్లను ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం..
- ఈ టోర్నీ ప్రారంభమైన తొలి సీజన్లోనే చెన్నై ఫైనల్కు చేరుకుంది. రెండో సీజన్లో సెమీస్కే పరిమితమైంది. ఇక మూడో సీజన్లో (2010) చెన్నై టైటిల్ను నెగ్గింది. ముంబయితో జరిగిన ఫైనల్లో 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం ముంబయిని 146 పరుగులకే పరిమితం చేసి తొలిసారి టైటిల్ వశం చేసుకుంది.
- ధోనీ నాయకత్వంలోని చెన్నై వరుసగా రెండో ఏడాది (2011) కూడా టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకెల్ హస్సీ (63), మురళీ విజయ్ (95) గొప్పగా ఆడారు. అనంతరం బెంగళూరును 147/8 పరుగులకే పరిమితం చేసింది.
- చివరిసారిగా 2011 తర్వాత చెన్నై మళ్లీ 2018లో టైటిల్ నెగ్గడం విశేషం. అయితే ఇందులో రెండేళ్లపాటు నిషేధానికి గురికావడం.. మరో మూడేళ్లు ఫైనల్కు చేరినా కప్ కొట్టలేకపోవడం జరిగింది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదారాబాద్ మంచి ఊపులో ఉంది. అంతకు రెండేళ్ల ముందే (2016) కప్ను నెగ్గింది. అయితే ఏడేళ్లపాటు టైటిల్ దక్కించుకోలేదనే కసితో ఉన్న చెన్నైని ఆపడం హైదారాబాద్ వల్ల కాలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 178/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 181 పరుగులు చేసి విజయం సాధించి మూడో టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ షేన్ వాట్సన్ (117) శతకంతో చెలరేగాడు.
- ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సాధించిన చివరి కప్ (2021) ఇదే. అయితే అంతకు ముందు ఏడాది లీగ్ దశకే పరిమితమై విమర్శలపాలైన చెన్నై అద్భుతంగా పుంజుకుని మరీ ఛాంపియన్గా నిలిచింది. రెండు దశల్లో జరిగిన 14వ సీజన్ తొలి ఫేజ్లో చెన్నై రాణించలేదు కానీ... యూఏఈ వేదికగా జరిగిన రెండో ఎడిషన్లో మాత్రం చెలరేగి ఫైనల్కు దూసుకొచ్చి ఏకంగా కప్ను సొంతం చేసుకుంది. తుదిపోరులో కోల్కతాపై చెన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై రుతురాజ్ గైక్వాడ్ (32), డుప్లెసిస్ ( 86), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37*) చెలరేగడంతో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం శుభ్మన్ గిల్ (51), వెంకటేశ్ అయ్యర్ (50) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 165/9 స్కోరుకే కేకేఆర్ పరిమితమైంది. దీంతో 27 పరుగుల ఆధిక్యంతో గెలిచి నాలుగో సారి చెన్నై టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్