WPL Final: దుమ్మురేపిన బెంగళూరు బౌలర్లు.. 113కి దిల్లీ ఆలౌట్‌

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో ఫైనల్‌ (WPL Final - DC vs RCB) మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగుతోంది.

Updated : 17 Mar 2024 21:12 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో ఫైనల్‌ (WPL Final - DC vs RCB) మ్యాచ్‌ థ్రిల్లింగ్‌గా సాగుతోంది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టును.. కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (23), షెఫాలి వర్మ (44) మినహా ఎవరూ రాణించలేదు. వికెట్‌ నష్టపోకుండా పవర్‌ ప్లేలో 61 పరుగులు చేసిన దిల్లీకి సోఫీ మోలినక్స్ షాకిచ్చింది. 8వ ఓవర్‌లో వరుసగా 3 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత కూడా దిల్లీ వికెట్ల పతనం ఆగలేదు. వచ్చినవాళ్లు వచ్చినట్టే పెవిలియన్‌ బాట పట్టారు. చివర్లో రాధా యాదవ్‌ (12), అరుంధతి రెడ్డి (10) బ్యాటు ఝళిపించే ప్రయత్నం చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్‌ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని