WI vs IND : సంజూను జట్టు నుంచి పక్కనపెట్టకండి: మాజీ క్రికెటర్ సూచన
వన్డే సిరీస్(WI vs IND) నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ నేడు. ప్రయోగాలతో తడబడిన భారత్(Team India).. మరి కీలకమైన విండీస్తో మూడో వన్డేలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తుందో చూడాలి.
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా (Team India) ప్రయోగాలకు సిద్ధమైన వేళ.. బ్యాటింగ్ దళం పూర్తిగా తడబడుతోంది. విండీస్తో తొలి మ్యాచ్(WI vs IND)లో స్వల్ప లక్ష్య చేధనలోనే ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక రెండో వన్డేలోనైతే బ్యాటింగ్ యూనిట్ పూర్తిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో సిరీస్ నెగ్గాలంటే.. కీలకమైన మూడో వన్డేలో గెలిచి తీరాలి. మరి ఈ వన్డేలో రోహిత్ సేన ప్రయోగాలకు వెళ్తుందా..? లేదా సీనియర్లతో కూడిన జట్టుతో బరిలోకి దిగుతుందా చూడాలి. ఈనేపథ్యంలో టీమ్ఇండియాకు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఓ సలహా ఇచ్చాడు.
సంజూ శాంసన్(Sanju Samson)ను తుది జట్టు నుంచి తప్పించొద్దని కోరాడు. ‘ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఓకే. కానీ.. మిడిలార్డర్లో అతడు ఎలా ఆడుతాడనేది మనకు తెలియదు. సంజూశాంసన్కు ఒక్క మ్యాచ్లో మూడో స్థానంలో ఆడే అవకాశం వచ్చింది. కాబట్టి అతడిని తుది జట్టు నుంచి తొలగించొద్దు. ఇక టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసి.. వన్డేల్లో తేలిపోతున్న సూర్యకుమార్(Suryakumar Yadav)కు ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్ అవుతుంది’ అని చోప్రా పేర్కొన్నాడు.
ఇక రెండో వన్డేకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్ పాండ్య(Hardik Pandya).. బ్యాట్తో పరుగులు చేయాల్సిన అవసరముందని చోప్రా పేర్కొన్నాడు. ‘హార్దిక్ బౌలింగ్ చేయడం ముఖ్యమే కానీ.. జట్టులో తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నపుడు అతడు పరుగులు చేయడం మరింత ముఖ్యం’ అని వివరించాడు. వన్డే సిరీస్(WI vs IND)లో 1-1తో సమంగా ఉన్న విండీస్, భారత్ జట్లు నేడు కీలకమైన ఆఖరి వన్డేలో తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు