Sunil Gavaskar: మన జట్టుతో వాళ్లకేం సంబంధం.. మీ సలహాలు మాకొద్దు : గావస్కర్
వన్డే ప్రపంచకప్ కోసం ప్రకటించిన టీమ్ఇండియా జట్టుపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. వీటిపై ఘాటుగా సమాధానమిచ్చాడు మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar)
ఇంటర్నెట్ డెస్క్ : అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ఎంపికపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ మాజీ ఆటగాళ్లు చేస్తున్న విమర్శలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డాడు. అలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్న మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశాడు.
ట్రంప్తో గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో వైరల్
జట్టు ఎంపిక విషయంలో మీ సలహాలు మాకు అవసరం లేదంటూ పాకిస్థాన్, ఆస్ట్రేలియా మాజీలపై గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్తో ఆడేందుకు భారత్ భయపడుతోందని పీసీబీ మాజీ చీఫ్ నజమ్ సేథీ గతంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. ‘వాళ్ల నుంచి ఏ ప్రకటన వచ్చినా మన మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. టీమ్ ఇండియా జట్టును పాకిస్థాన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎంపిక చేస్తున్నట్లు ఉంది. మన టీమ్తో వాళ్లకేం సంబంధం? మనవాళ్లు ఎవరైనా వెళ్లి వాళ్ల టీమ్ని ఎంపిక చేస్తున్నారా? ఇది వాళ్ల పని కాదు. మీడియాలో చూపించి మనమే వాళ్లకు అవకాశం ఇస్తున్నట్లు ఉంది’ అని గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మన ఆటగాళ్లతో పోల్చుతూ వాళ్ల ఆటగాళ్లే గొప్ప అని ప్రచారం చేసుకుంటారని గావస్కర్ అన్నాడు. ‘అక్కడి వాళ్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే బాబర్ గొప్ప అని, షహీన్ అఫ్రిది మంచి బౌలర్ అని, సచిన్ తెందూల్కర్ కంటే ఇంజిమాముల్ హక్ మంచి బ్యాటర్ అని వాళ్లకు వాళ్లు గొప్పలకు పోతారు. ఇలా వాళ్ల అభిమానులకు దగ్గరవుతారు. మన మీడియాలో వారికి అంతా ప్రాధాన్యం ఇవ్వొద్దు. మీ జట్టులో ఈ ఆటగాడు ఉండాలని దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చెబుతుంది. ఎవరు మూడు, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలో వాళ్లే చెబుతారు. మీ సలహాలు మాకు అవసరం లేదు’ అని గావస్కర్ విరుచుకుపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం