ENG vs SL: విజృంభించిన శ్రీలంక పేసర్లు.. ఇంగ్లాండ్కు మరో షాక్ తప్పదా?
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు మరో షాక్ తప్పేలాలేదు. ఇప్పటికే పసికూన అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై చిత్తుగా ఓడే అవకాశముంది. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ 156 పరుగులకే కుప్పకూలింది.
బెంగళూరు: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ (England)కు మరో షాక్ తప్పేలాలేదు. ఇప్పటికే పసికూన అఫ్గాన్ చేతిలో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. తనకన్నా బలహీన శ్రీలంకపై చిత్తుగా ఓడే అవకాశముంది. శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్కరూ కూడా అర్ధ శతకం చేయలేకపోయారు. బెన్స్టోక్స్ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్. జానీ బెయిర్స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ (15; 15 బంతుల్లో) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్ వోక్స్ (0), ఆదిల్ రషీద్ (2), మార్క్ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2, మహీశ్ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.
మొదటి ఆరు ఓవర్లకు ఇంగ్లాండ్ 44/0 స్కోరుతో పటిష్టమైన స్థితిలోనే ఉంది. ఈ మ్యాచ్తో పునరాగమనం చేసిన లంక బౌలర్ ఏంజెలో మాథ్యూస్ తన తొలి ఓవర్లోనే మలన్ను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ పతనం మొదలైంది. మలన్.. వికెట్కీపర్ కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాత వచ్చిన జో రూట్ రనౌటయ్యాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ బెయిర్స్టో కూడా కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అతడు రజిత బౌలింగ్లో మిడాన్లో ధనంజయకు చిక్కాడు. లాహిరు కమార తన వరుస ఓవర్లలో బట్లర్, లివింగ్ స్టోన్లను పెవిలియన్కు పంపాడు. బట్లర్.. కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇవ్వగా.. లివింగ్స్టోన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మొయిన్ అలీని 25 ఓవర్లో మాథ్యూస్ వెనక్కి పంపాడు. రజిత బౌలింగ్లో క్రిస్ వోక్స్.. సమరవిక్రమకు చిక్కాడు. ఒంటరి పోరాటం చేస్తున్న స్టోక్స్ను లాహిరు కుమార వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన ఆదిల్ రషీద్ 32 ఓవర్లో రనౌట్ కాగా.. తీక్షణ బౌలింగ్లో మార్క్వుడ్ స్టంపౌట్ కావడంతో ఇంగ్లాండ్ ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్