WI vs IND: ఉమ్రాన్ను సరిగ్గా వాడుకోవడమూ తెలియదా..?: ఆకాశ్ చోప్రా
విండీస్తో వన్డే సిరీస్ను (WI vs IND) భారత్ ప్రయోగాలకు వేదికగా మార్చుకుంది. తొలి వన్డేల్లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్ ఆర్డర్లో భారీగా మార్పులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో (WI vs IND) జరిగిన తొలి వన్డేలో ఒక్క ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) మినహా.. మిగతా భారత బౌలర్లందరూ వికెట్ తీశారు. ఉమ్రాన్ తొలి ఓవర్లోనే పది పరుగులు ఇచ్చాడు. అయితే, తర్వాత వేసిన రెండు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో ఉమ్రాన్ను సరిగ్గా వాడుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమైందని టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు.
స్మిత్ ‘రనౌట్’ విషయంలో.. అంపైర్ చెప్పిందదే: స్టువర్ట్ బ్రాడ్
‘‘ఉమ్రాన్ను జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించారు. అతడు వికెట్ కూడా తీయలేదు. మిగతా బౌలర్లు రాణించడంతో విండీస్ త్వరగా వికెట్లను కోల్పోయింది. ఇలాంటప్పుడే ఉమ్రాన్ బౌలింగ్ను సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తోంది. వికెట్ తీసేందుకు అతడికి మరో రెండు ఓవర్లు ఇచ్చి ఉంటే బాగుండేది. అలా జరగలేదు. ఉమ్రాన్తో చివర్లో బౌలింగ్ చేయించి ఉంటే అతడూ వికెట్లు తీసే అవకాశం కల్పించినట్లు ఉండేది. ఉమ్రాన్ మాలిక్ను వరల్డ్ కప్ కోసం బ్యాకప్ పేసర్గా పరిగణిస్తే మాత్రం పొరపాటు చేసినట్లవుతుంది. ఎందుకంటే అతడు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. గత ఐపీఎల్లోనూ రాణించలేకపోయాడు. అలాగే ఆసియా గేమ్స్కు కూడా ఎంపిక చేయలేదు. బుమ్రా ఫిట్నెస్ సాధించినా.. సాధించకపోయినా మరో ఎక్స్ప్రెస్ పేసర్ ఉండాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా ఉంది’’ అని ఆకాశ్ వ్యాఖ్యానించాడు.
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీపై..
‘‘విండీస్తో తొలి వన్డేలో భారత్ ప్రయోగాలు చేసింది. రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపించింది. అక్కడ కిషన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఈ అర్ధశతకంతో ఇషాన్ కొత్తగా ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటికే అతడు అద్భుతమైన ఆటగాడని అందరికీ తెలుసు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్కు మాత్రం ఇదొక అద్భుత అవకాశం. కానీ, గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. నా ప్రపంచకప్జట్టులో అతడికి చోటు ఉంటుంది. తప్పకుండా భారీ ఇన్నింగ్స్లు ఆడతాడని నమ్మకముంది’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు