Ambati Rayudu: ఫైనల్ కోసం అలాంటి ‘పిచ్’ను ఉద్దేశపూర్వకంగా చేస్తే.. అది మూర్ఖత్వమే: రాయుడు
వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో (ODI World Cup 2023) టాస్ ఓడిపోయి భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇదే టీమ్ఇండియా ఓటమికి కారణమనే వ్యాఖ్యలను మాజీ ఆటగాడు అంబటి రాయుడు కొట్టిపడేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఫైనల్లో భారత ఓటమికి మందకొడి పిచ్ కారణమని మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. టాస్ ఏమాత్రం కీలకం కాదని చెబుతూనే.. పిచ్ పరిస్థితులు టీమ్ఇండియాకు కలిసిరాలేదని వ్యాఖ్యానించాడు. పిచ్ మామూలుగా ఉండుంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండేదని పేర్కొన్నాడు. అప్పుడు ఆసీస్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించేదని రాయుడు తెలిపాడు.
‘‘ఫైనల్ కోసం ఇలాంటి పిచ్ను తయారు చేసి ఉండాల్సింది కాదు. మరీ నెమ్మదిగా ఉంది. అయితే, ఇలా ఉండాలని ఎవరు సూచించారో తెలియదు. అలాంటి పిచ్ కాకుండా ఉండుంటే.. తప్పకుండా భారత్ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఎందుకంటే ఆసీస్ కంటే అన్ని విభాగాల్లో బలంగానే ఉన్నాం. అయితే, ఫైనల్లో మనకు కలిసిరాలేదు.
ఫైనల్లో భారత్కు అనుకూలంగా పిచ్ను రూపొందించి ఉంటారని తొలుత కొంతమంది అనుకున్నారు. కానీ, పిచ్ మరీ మందకొడిగా ఉండటంతో టీమ్ఇండియా ఇబ్బంది పడింది. వంద ఓవర్లు పిచ్ ఒకటే అయినా.. స్పందించిన తీరు భిన్నంగా ఉంది. మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతూ వచ్చేసింది. అయితే, టాస్కు అంత ప్రాధాన్యం లేదని చెబుతా. ప్రత్యేక కారణంతోనే ఇలా పిచ్ను తయారు చేసి ఉంటే మాత్రం ఇంతకుమించిన మూర్ఖత్వం మరొకటి లేదు. అలా చేసి ఉండరని భావిస్తున్నా’’ అని అంబటి రాయుడు తెలిపాడు.
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ 240 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 43 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 241 పరుగులు చేసి విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ (137) అద్భుత శతకంతో ఆసీస్ను గెలిపించాడు. దీంతో ఆరోసారి ఆ జట్టు కప్ను కైవసం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్