Gautam Gambhir: అది వింత వాదన.. అత్యుత్తమ జట్టే ప్రపంచకప్ గెలిచింది: గౌతమ్ గంభీర్
అత్యుత్తమ జట్టు వన్డే ప్రపంచ కప్ సాధించలేదని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనను భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కొట్టిపారేశాడు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ (World Cup 2023)లో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ చేరిన టీమ్ఇండియా (Team India).. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా (Australia) ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. అయితే, ఆసీస్ ప్రపంచకప్ గెలవడంపై పలువురు మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచ కప్ దక్కలేదని, టోర్నమెంట్లో టీమ్ఇండియానే బెస్ట్ అని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్తోపాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ వాదనతో టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఏకీభవించలేదు. ఇది వింత వాదన అని, అత్యుత్తమ జట్టే విశ్వ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు.
‘‘చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ గెలవలేదని కొంతమంది విశ్లేషకులు చెప్పడం నేను విన్నాను. అది వాస్తవం కాదు. నేను విన్న వింత వాదనల్లో అది ఒకటి. వాస్తవానికి అత్యుత్తమ జట్టే ప్రపంచ కప్ గెలిచింది. నిజాయితీగా మాట్లాడుదాం. భారత్ 10 మ్యాచ్లు గెలిచి చాలా మంచి ఫామ్లో ఉంది. కాబట్టి వారు ఫేవరెట్గా బరిలోకి దిగారు. కానీ, ఆస్ట్రేలియా మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత వరుసగా ఎనిమిది విజయాలను అందుకొంది. అత్యుత్తమ జట్టు మాత్రమే ప్రపంచ కప్ను గెలుస్తుంది. మీరు దానిని ఆ విధంగా నిర్వచించలేరు. టీమ్ఇండియా 10 మ్యాచ్లు గెలిచింది. కానీ, ఒక మ్యాచ్లో పేలవంగా ఆడింది. సెమీ ఫైనల్, ఫైనల్ నాకౌట్ మ్యాచ్లు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచామా లేదా 4వ స్థానంలో నిలిచామా అనేది ముఖ్యం కాదు. అత్యుత్తమ జట్టు ప్రపంచకప్ సాధించిందని అంగీకరించండి. భారత్ బాగా ఆడలేదు. ఈ వాస్తవానికి దూరంగా ఆలోచించకండి’’ అని గంభీర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు