సంక్షిప్త వార్తలు(4)
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్ శుభారంభం చేశాడు. గత కొంతకాలంగా ఫామ్తో ఇబ్బందులు పడుతున్న అతను ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు.
సాయి ప్రణీత్ శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్ శుభారంభం చేశాడు. గత కొంతకాలంగా ఫామ్తో ఇబ్బందులు పడుతున్న అతను ప్రిక్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ప్రణీత్ 21-13, 21-14తో క్రిస్టోఫెర్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. కిరణ్ జార్జ్ 21-17, 19-21, 23-21తో చియా లీ (చైనీస్ తైపీ)పై నెగ్గి ముందంజ వేశాడు. సమీర్వర్మ 14-21, 16-21తో షై ఫెంగ్ (చైనా) చేతిలో, మిథున్ మంజునాథ్ 18-21, 12-21తో కెంటా నిషిమొటొ (జపాన్) చేతిలో, ప్రియాంశు రజావత్ 21-14, 19-21, 25-27తో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో అష్మిత చాలిహా 21-16, 21-19తో అనుపమ ఉపాధ్యాయపై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్- సిక్కిరెడ్డి జోడీ 21-11, 21-16తో అలెగ్జాండర్- జోసెఫిన్ (కెనడా) జంటపై విజయం సాధించింది. సుమీత్రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ 11-21, 17-21తో రెహాన్- లిసా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది.
ఛాంప్స్ సహర్ష, దీక్షిత, సంహిత
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పాఠశాలల చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు చల్లా సహర్ష, మోదిపల్లి దీక్షిత, పుంగవనం సంహిత అదరగొట్టారు. తమిళనాడులో జరిగిన ఈ టోర్నీలో సహర్ష, దీక్షిత, సంహిత ఛాంపియన్లుగా నిలిచారు. అండర్-13 బాలురలో సహర్ష (8 పాయింట్లు), అండర్-11 బాలికల్లో దీక్షిత (7.5), అండర్-9 బాలికల్లో సంహిత (8) అగ్రస్థానాల్లో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు. అండర్-7 బాలికల్లో బోగ వంశిక (7) రజతం, బాలుర విభాగంలో ఎ.దివిత్రెడ్డి (7.5) కాంస్య పతకాలు నెగ్గారు.
నేను పాక్కు కోచ్గా ఉండను: అక్రమ్
కరాచి: ఏనాడూ పాకిస్థాన్ జాతీయ జట్టుకు కోచింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలించలేదని ఆ దేశ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అన్నాడు. దేశంలో కోచ్లు, కెప్టెన్లు తీవ్ర దూషణలకు గురి కావడమే అందుకు కారణమని చెప్పాడు. ‘‘జట్టు బాగా ఆడనప్పుడు విమర్శిస్తే అంగీకరించగలను. కానీ పాకిస్థాన్లో కెప్టెన్, కోచ్లను ప్రతి ఒక్కరూ విమర్శించడమే కాదు, దూషిస్తారు కూడా. దాన్ని భరించడం చాలా కష్టం. దూషణలను, కొన్నిసార్లు ద్వేషాన్ని.. కెప్టెన్, కోచ్ భరించాల్సి ఉంటుంది. కానీ నేను భరించలేను. నాకంత సహనం లేదు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో దూషణలను తట్టుకోవడం కష్టం. కొందరు రోజంతా ట్విట్టర్లో గడుపుతూ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుంటారు’’ అని అక్రమ్ అన్నాడు. జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడంతో పాటు వచ్చే ఒత్తిడిని తాను కోరుకోవట్లేదని చెప్పాడు.
తెలంగాణకు మూడు పతకాలు
భోపాల్: ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు సత్తాచాటారు. బుధవారం కయాకిగ్- కనోయింగ్లో తెలంగాణ ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించింది. 1000 మీటర్ల రేసులో ప్రదీప్- అభయ్ రజతం, మహేంద్ర సింగ్- కునాల్ కాంస్య పతకాలు నెగ్గారు. మూడో స్థానంలో నిలిచిన అమిత్ కుమార్ కాంస్యం గెలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్