ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు ముందంజ వేసే ఆవకాశాలు ఇక లేవు. ప్రస్తుతం తలో 12 పాయింట్లతో ఉన్న లఖ్నవూ, దిల్లీ మధ్య ఓ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా పాయింట్లు 14 అవుతాయి. రద్దయినా 13 పాయింట్లతో ముంబయి కన్నా మెరుగైన స్థితిలో ఉంటాయి. మిగిలిన 9 జట్లూ రేసులో ఉన్నాయనే చెప్పాలి. చెరో 11 మ్యాచ్ల్లో ఎనిమిదేసి విజయాలతో 16 పాయింట్లు సాధించి వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్న కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపుగా ఖాయమే! మరో విజయం సాధిస్తే ఈ రెండు జట్లకూ తిరుగుండదు. లఖ్నవూపై భారీ విజయంతో నెట్ రన్రేట్ను మెరుగుపర్చుకున్న సన్రైజర్స్ కూడా ప్లేఆఫ్స్కు మరింత దగ్గరైంది. 12 మ్యాచ్ల్లో ఏడో గెలుపుతో మూడో స్థానానికి ఎగబాకిన సన్రైజర్స్ మరో మ్యాచ్ నెగ్గితే ముందంజ వేయొచ్చు. తన చివరి రెండు మ్యాచ్లనూ (గుజరాత్, పంజాబ్తో) సొంతగడ్డపైనే ఆడబోతుండటం సన్రైజర్స్కు కలిసొచ్చే అంశం. ఇక చెన్నై, దిల్లీ, లఖ్నవూ తలో 12 పాయింట్లతో ఉన్నాయి. కానీ దిల్లీ, లఖ్నవూ (12 మ్యాచ్లు) కంటే ఓ మ్యాచ్ తక్కువే ఆడిన చెన్నైకు ముందంజ వేసేందుకు మరింత మెరుగైన అవకాశాలున్నాయి. 11 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, పంజాబ్, గుజరాత్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సాంకేతికంగా ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నా.. నెట్ రన్రేట్, ఇతర జట్ల ఫలితాలపై ఈ మూడు ఫ్రాంఛైజీలు ఆధారపడాల్సి ఉంటుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుందనే సంగతి తెలిసిందే. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.