సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు.
దిల్లీ: ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. తొలిసారి ఒలింపిక్స్లో పోటీపడబోతున్న బాక్సింగ్ సంచలనం నిఖత్ జరీన్ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం సంగీతం వింటానని, సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తానని చెబుతోంది. ప్రస్తుతం పటియాలాలో సాధన కొనసాగిస్తున్న ఈ 27 ఏళ్ల తెలంగాణ బాక్సర్పై పారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలో కచ్చితంగా పతకం గెలుస్తుందనే అంచనాలున్నాయి. ‘‘త్వరలోనే ఒలింపిక్స్కు వెళ్లబోతున్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఎల్లప్పుడూ మంచి ప్రదర్శనపై ధ్యాస పెట్టేలా మెదడుకు శిక్షణనిస్తుంటా. ప్రతి టోర్నీతో ఒత్తిడి ఏర్పడుతూనే ఉంటుంది. మనతో పాటు మన చుట్టూ ఉండేవాళ్లకూ మనపై అంచనాలుంటాయి. ఇవన్నీ కలిపి మెదడుపై అదనపు భారాన్ని మోపుతాయి. దీన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాలి. ధ్యాస మరల్చకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏకాగ్రత చెదరకూడదు. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నా. అలాగే జనాల నుంచి కూడా కాస్త దూరం పాటిస్తున్నా. ఇప్పుడు నేను శక్తిని కాపాడుకునే స్థితిలో ఉన్నా. అలాగే కొన్నిసార్లు తీపి పదార్థాలూ తింటున్నా. సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నా. సంగీతం వింటున్నా. సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తున్నా. ప్రస్తుతం ‘హీరామండీ’ సిరీస్ చూస్తున్నా. అది ఆసక్తికరంగా ఉంది. ఇలా మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటున్నా’’ అని రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ చెప్పింది. ‘‘టోక్యో ఒలింపిక్స్కు వెళ్లాలని ఎంత బలంగా కోరుకున్నానో అందరికీ తెలుసు. కానీ అది జరగలేదు. ఆ ఎదురుదెబ్బ నన్ను దృఢంగా మార్చింది. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన రోజు కలిగిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఓ ప్రధానమైన కల నిజమైనట్లు అనిపించింది. కానీ ఇప్పటికీ సగం పని మాత్రమే పూర్తయింది. రింగ్లో ఒంటరిగానే పోరాడాలి. మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో సాగాలి. ఇదే నా ప్రయాణం. నొప్పిని భరించాల్సిందే’’ అని నిఖత్ పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్లో దిగ్గజం మేరీకోమ్ చేతిలో నిఖత్ ఓడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.