ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది.
మార్సె: 1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. బెలెమ్గా పిలుస్తున్న ఈ ప్రసిద్ధి గాంచిన ఓడ ఏథెన్స్ నుంచి జ్యోతితో ప్రయాణాన్ని మొదలెట్టి.. దక్షిణ ఫ్రెంచ్ నగరమైన మార్సెకు బుధవారం చేరుకుంది. జ్యోతి రాకతో ఈ ఏడాది ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ దేశంలో సంబరాలు మిన్నంటాయి. వేలాది పడవల పరేడ్ మధ్య బెలెమ్.. మార్సె తీరాన్ని చేరుకుంది. ఈ పురాతన ఓడరేవులో అథ్లెటిక్ ట్రాక్లా కనిపించే వేదిక దగ్గర ఈ బెలెమ్ ఆగింది. ఒలింపిక్ జ్యోతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలిరావడంతో ఓడరేవు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మార్సెలో గురువారం ఈ జ్యోతి యాత్ర ఆరంభమవుతుంది. ఫ్రాన్స్లో జ్యోతిని పట్టుకుని యాత్రలో పాల్గొనే మొట్టమొదటి వ్యక్తిగా ఒలింపిక్ స్విమ్మర్ ఫ్లోరెంట్ మనాడోను ఎంపిక చేశారు. అతను నాలుగు ఒలింపిక్ పతకాలు గెలిచాడు. ‘‘ఒలింపిక్స్ మా దేశానికి తిరిగి రావడం మాకో అద్భుతమైన సంబరం. ఓ పోటీలను ప్రారంభించడం ఎంత ముఖ్యమో ఓ మాజీ అథ్లెట్గా నాకు తెలుసు. అందుకే జ్యోతి రాక కోసం మార్సెను ఎంచుకున్నాం. క్రీడలను ప్రేమించే నగరాల్లో ఇదొకటి’’ అని పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు టోనీ ఎస్తాంగూట్ పేర్కొన్నాడు. ఫ్రాన్స్ వ్యాప్తంగా యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత పోటీలకు వేదికైన పారిస్కు ఈ జ్యోతి చేరుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.