Pakistan: ఆసియాకప్నకు పాక్ దూరం?
ఆసియాకప్ను తమ దేశం నుంచి శ్రీలంకకు తరలించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరాచి: ఆసియాకప్ను తమ దేశం నుంచి శ్రీలంకకు తరలించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ తన మ్యాచ్లను యూఏఈలో ఆడాలని పాక్ చేసిన ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదనను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలు తిరస్కరించాయి. దీంతో ఈ కప్ను ఏసీసీ.. పాక్ నుంచి తరలించింది. ఈ విషయంపై మంగళవారం దుబాయ్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారులతో సమావేశమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజామ్ సేథి.. కప్ను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
‘‘ఆసియాకప్ నిర్వహణపై తమ ప్రతిపాదనలను ఏసీసీ ముందు ఉంచాం. ఒకవేళ సభ్యదేశాలు అంగీకరించకపోతే 2018, 2022లో మాదిరే యూఏఈలో టోర్నీ నిర్వహించాలి. సెప్టెంబర్లో యూఏఈలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్థమే లేదు. 2020లో ఐపీఎల్ టోర్నీ సెప్టెంబర్-నవంబర్లో ఇదే వేదికలో జరిగిన విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరిలో జరిగిన ఏసీసీ సమావేశంలో శ్రీలంక ఆసియాకప్ ఆతిథ్య ప్రతిపాదనను బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తిరస్కరించాయి. కానీ ఉన్నట్టుండి లంకకు ఆతిథ్య హక్కులు దక్కడానికి ఆ దేశాలు ఎలా అంగీకరిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆసియాకప్ను శ్రీలంక తరలించడంలో భారత్ వెనుక నుంచి సహకారం అందించిందని పీసీబీ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2న ఆసియాకప్ ఆరంభం కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..