India vs Australia: బౌలింగా.. బ్యాటింగా..?
ఆదివారం అహ్మదాబాద్లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్పై చర్చ జోరందుకుంది. ఈ మైదానంలో 11 పిచ్లున్నాయి. ఒకటి నుంచి అయిదు పిచ్లు నల్లమట్టితో కూడినవి.
అహ్మదాబాద్ : ఆదివారం అహ్మదాబాద్లో భారత్, ఆస్ట్రేలియా(India vs Australia) ఫైనల్ నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్పై చర్చ జోరందుకుంది. ఈ మైదానంలో 11 పిచ్లున్నాయి. ఒకటి నుంచి అయిదు పిచ్లు నల్లమట్టితో కూడినవి. వీటిపై బౌన్స్ లభిస్తుంది. ఎర్రమట్టితో కూడిన 6 నుంచి 11 పిచ్లు త్వరగా మందకొడిగా మారతాయి. ఈ ఫైనల్ నల్లమట్టి పిచ్పైనే జరిగే అవకాశముంది. ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకైతే ఇక్కడి పిచ్ బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరించింది. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఛేదనలో జట్లు మూడు నెగ్గాయి. ఇంగ్లాండ్తో మ్యాచ్లో మొదట ఆస్ట్రేలియా చేసిన 286 పరుగులే ఈ టోర్నీలో ఇక్కడ అత్యధిక స్కోరు. ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదట 282 పరుగులు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాకిస్థాన్ను మొదట 191 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. ఛేదనలో మూడు వికెట్లే కోల్పోయి 30.3 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. ఓవరాల్గా ఇప్పటివరకూ ఇక్కడ 32 వన్డేలు జరిగితే.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 17, ఛేదన జట్టు 15 మ్యాచ్ల్లో గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 237 మాత్రమే.
ఆ వివాదం..: న్యూజిలాండ్తో భారత్ సెమీస్ కోసం వాంఖడేలో చివరి నిమిషంలో తాజా పిచ్కు బదులు వాడిన పిచ్పై మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కానీ తాజా పిచ్పైనే మ్యాచ్ నిర్వహించాలనే నిబంధన ఏమీ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీ పిచ్ సలహాదారు ఆండీ అట్కిన్సన్ ఈ పిచ్ను ఇంకా పరిశీలించలేదు. దీంతో పిచ్ సన్నాహకాలను బీసీసీఐ క్యూరేటర్లు చూసుకుం టున్నారు. సెమీస్ పిచ్ విషయంలో అట్కిన్సన్కు బీసీసీఐకి మధ్య పడలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం పిచ్ను అట్కిన్సన్ పరిశీలించే అవకాశముంది. శుక్రవారం ఇద్దరు బీసీసీఐ సీనియర్ క్యూరేటర్లు ఆశిష్ భౌమ్నిక్, తపోష్ ఛటర్జీ.. బీసీసీఐ జీఎం (దేశవాళీ క్రికెట్) అభయ్ కురువిల్లాతో కలిసి పిచ్ సన్నాహకాలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ఫైనల్ కోసం తాజా పిచ్ను సిద్ధం చేస్తున్నారా? లేదా ఇప్పటికే ఉపయోగించిన దాన్ని వాడబోతున్నారా? అనేదానిపై స్పష్టత లేదు. పిచ్పై భారీ రోలర్ను తిప్పడం కనిపించింది. మందకొడి బ్యాటింగ్ ట్రాక్ను రూపొందించే పనిలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛేదనలో బ్యాటింగ్ చేసే జట్టుకు పరిస్థితులు క్లిష్టంగా మారతాయని, 315 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని గుజరాత్ రాష్ట్ర సంఘం క్యూరేటర్ ఒకరు చెప్పారు. మరోవైపు పిచ్ను పరిశీలించిన రోహిత్, ద్రవిడ్ అనంతరం క్యూరేటర్లతో చర్చించారు. ఇక ఫైనల్ నేపథ్యంలో రోహిత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా నెట్ సెషన్లో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!