SKY: సూర్య సారథ్యంలో ఆసీస్తో టీ20లకు
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ఆరంభించనుంది.
విశాఖలో 23న తొలి మ్యాచ్
దిల్లీ: వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ఆరంభించనుంది. ఈ గురువారం నుంచి రెండు జట్లూ అయిదు టీ20ల్లో తలపడబోతుండగా.. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ సిరీస్లోనూ ఆడరు. ఏడాదిగా టీ20ల్లో జట్టును నడిపిస్తున్న హార్దిక్ పాండ్య గాయంతో వన్డే ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దీంతో వైస్కెప్టెన్ సూర్యకుమార్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ సహా ఆ క్రీడల్లో ఆడిన మెజారిటీ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ ఆడలేకపోయిన అక్షర్ పటేల్ ఈ సిరీస్లో ఆడనుండగా.. కప్పులో జట్టు సభ్యులుగా ఉన్న ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణలకు కూడా అవకాశం దక్కింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన రియాన్ పరాగ్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రపంచకప్లో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్లకు అతను వైస్కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్ జరగనుండగా.. తర్వాత వరుసగా 26న తిరువనంతపురం, 28న గువాహటి, డిసెంబరు 1న రాయ్పుర్, 3న బెంగళూరు మిగతా మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్శర్మ డ్రెస్సింగ్రూమ్లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో బ్యాటర్గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.