SKY: సూర్య సారథ్యంలో ఆసీస్తో టీ20లకు
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ఆరంభించనుంది.
విశాఖలో 23న తొలి మ్యాచ్
దిల్లీ: వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవిచూసిన టీమ్ఇండియా.. అదే జట్టుతో ఇంకో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ఆరంభించనుంది. ఈ గురువారం నుంచి రెండు జట్లూ అయిదు టీ20ల్లో తలపడబోతుండగా.. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ సిరీస్లోనూ ఆడరు. ఏడాదిగా టీ20ల్లో జట్టును నడిపిస్తున్న హార్దిక్ పాండ్య గాయంతో వన్డే ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. అతను ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు దూరమయ్యాడు. దీంతో వైస్కెప్టెన్ సూర్యకుమార్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆసియా క్రీడల్లో జట్టును నడిపించిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ సహా ఆ క్రీడల్లో ఆడిన మెజారిటీ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ ఆడలేకపోయిన అక్షర్ పటేల్ ఈ సిరీస్లో ఆడనుండగా.. కప్పులో జట్టు సభ్యులుగా ఉన్న ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణలకు కూడా అవకాశం దక్కింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన రియాన్ పరాగ్తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. ప్రపంచకప్లో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండడు. చివరి రెండు మ్యాచ్లకు అతను వైస్కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ నెల 23న విశాఖపట్నంలో తొలి మ్యాచ్ జరగనుండగా.. తర్వాత వరుసగా 26న తిరువనంతపురం, 28న గువాహటి, డిసెంబరు 1న రాయ్పుర్, 3న బెంగళూరు మిగతా మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.