OneDay Format: వన్డేల భవితవ్యమేంటి?
భారత్లో ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్లో టీమ్ఇండియా ఓడిందనే బాధను పక్కన పెడితే.. టోర్నీ మన దేశంలో గొప్పగా సాగింది. వన్డేలకు ఆదరణ తగ్గిపోతుందనుకునే సమయంలో ఈ ప్రపంచకప్కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఫార్మాట్ మారుతుందా?
భారత్లో ప్రపంచకప్ ముగిసింది. ఫైనల్లో టీమ్ఇండియా ఓడిందనే బాధను పక్కన పెడితే.. టోర్నీ మన దేశంలో గొప్పగా సాగింది. వన్డేలకు ఆదరణ తగ్గిపోతుందనుకునే సమయంలో ఈ ప్రపంచకప్కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. క్రికెట్ను విపరీతంగా ఇష్టపడే భారత్లో ఈ టోర్నీ జరిగింది కాబట్టే ఈ మాత్రం విజయవంతమైంది. మరి ఇప్పుడు వన్డేల పరిస్థితేంటి? అవి మనుగడ సాగిస్తాయా? నాలుగేళ్ల తర్వాత భారత్ వెలుపల జరిగే ప్రపంచకప్కు ఆదరణ ఉంటుందా?
ఈనాడు క్రీడావిభాగం
ప్రపంచ క్రికెట్కు గుండె చప్పుడు భారత్ అనడంలో సందేహం లేదు. మన దేశంలో జరిగిన ప్రపంచకప్కు లభించిన ఆదరణే అందుకు నిదర్శనం. చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు స్టేడియాల్లో వీక్షించిన ప్రపంచకప్గా ఇది రికార్డు నమోదు చేయడం విశేషం. 45 రోజుల పాటు సాగిన టోర్నీలో మ్యాచ్లను తిలకించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా భారత్ ఆడిన మ్యాచ్లకైతే స్టేడియాలు నిండిపోయాయి. ప్రపంచకప్ అది కూడా భారత్లో జరిగింది కాబట్టే ఈ పరిస్థితి ఉంది. మరి ద్వైపాక్షిక సిరీస్లకు ఇంతటి ఆదరణ ఉంటుందా? అంటే సందేహమే. వన్డేల్లో జట్లు ఆడే ద్వైపాక్షిక సిరీస్లు, మ్యాచ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గతంలో ఓ జట్టు ఏడాదికి 50 వరకు వన్డేలాడేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 ప్రపంచకప్కు ముందు ద్వైపాక్షిక సిరీస్ల్లో భాగంగా భారత్ 30 వన్డేలు మాత్రమే ఆడనుంది. మిగతా జట్లూ ఇంతకంటే ఎక్కువ వన్డేలాడకపోవచ్చు. 2019 ప్రపంచకప్ ఫైనల్లో తలపడ్డ ఇంగ్లాండ్, న్యూజిలాండ్.. మళ్లీ వన్డేలో ఢీకొట్టింది ఈ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లోనే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 2024, 2026లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో జట్ల దృష్టి మొత్తం పొట్టి ఫార్మాట్పైనే ఉంటుందనడంలో సందేహం లేదు. మళ్లీ 2027లో వన్డే ప్రపంచకప్ ఉంది. అయినా ఈ టోర్నీ దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాల్లో జరగబోతుండటంతో ఆదరణ లభిస్తుందో లేదో అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడే వన్డే మ్యాచ్ కోసం 8 గంటల సమయం గడిపేందుకు జనాలు పెద్దగా ఇష్టపడటం లేదు. నాలుగేళ్లకు పరిస్థితి మరింత క్షీణిస్తుందనే చెప్పాలి.
వన్డేలు బతకాలంటే ఫార్మాట్ మార్చాలని దిగ్గజాలు సూచిస్తున్నారు. ఇన్నింగ్స్కు 50 చొప్పున 100 ఓవర్ల మ్యాచ్ కాకుండా కొత్త విధానంలో వన్డేలు నిర్వహించాలంటున్నారు. 25 ఓవర్ల చొప్పున నాలుగు ఇన్నింగ్స్లుగా వన్డే మ్యాచ్ను విభజించాలని సచిన్ చెబుతున్నాడు. మొదట 25 ఓవర్ల పాటు ‘ఎ’ జట్టు బ్యాటింగ్ చేస్తే, తర్వాతి 25 ఓవర్లు ‘బి’ బ్యాటింగ్కు దిగాలని.. అనంతరం ‘ఎ’ జట్టు స్కోరు ఎక్కడైతే ఆగిందో, అక్కడి నుంచి కొనసాగిస్తూ 25 ఓవర్లు ఆడాలని, చివరగా ‘బి’ జట్టు ఛేదన చేయాలని సచిన్ పేర్కొన్నాడు. మËరోవైపు ఇన్నింగ్స్కు 40 ఓవర్ల చొప్పున వన్డేలను కుదించాలని వసీం అక్రమ్ సూచించాడు. ప్రస్తుతం ఓ వన్డే ఇన్నింగ్స్లో తొలి, చివరి 10 ఓవర్లు మాత్రమే ఆసక్తితో చూస్తున్నారు. మధ్యలో 30 ఓవర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి వన్డే క్రికెట్ ఫార్మాట్ను మార్చేందుకు ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. మరోవైపు ప్రపంచకప్కు ఏడాది ముందు నుంచే వన్డే ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించాలని ఐసీసీకి క్రికెట్ చట్టాలు పర్యవేక్షించే మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సూచించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం