Umran malik: మావాడి విషయంలో తొందరపడటం లేదు: ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ రషీద్
తమ కుమారుడు టీ20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడం తమను ఏమాత్రం బాధించలేదని ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్ అన్నాడు.
దిల్లీ: ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టుకు టీమ్ఇండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఉమ్రాన్ తండ్రి అబ్దుల్ రషీద్ స్పందించాడు. తాము ఈ విషయంలో ఏమాత్రం బాధపడటం లేదన్నాడు. జట్టులో చేరిన స్వల్ప కాలంలోనే ఉమ్రాన్ దేశం తరఫున ఆడాలని తాము కోరుకోవడం లేదని తెలిపాడు.
‘‘ఉమ్రాన్ ప్రపంచజట్టులో స్థానం సంపాదించలేకపోయాడంటూ అంతా అంటున్నారు. అతడు ప్రపంచకప్ జట్టులో ఆడకపోవడం కూడా ఒకింతకు మంచిదే. అతడి అరంగేట్రానికి ఇంతకన్నా మంచి సందర్భమేదో ఉందని మేం నమ్ముతున్నాం. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. మా కుమారుడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పుడే దేశం తరఫున ఆడాలని తొందరపడటం లేదు. అతడు సీనియర్లతో డ్రెస్సింగ్ రూంను పంచుకుంటున్నాడు. వారి ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటాడు. టీమ్ఇండియాలో ఎంతో అనుభవమున్న ఆటగాళ్లు ఉన్నారు. వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఇక మిగిలిన వారు సెలక్టర్ల దృష్టిలో పడినప్పుడు అవకాశాలు అవే వస్తాయి’’ అంటూ రషీద్ వివరించాడు.
భారత టీ20 లీగ్లో అత్యంత వేగవంతమైన బౌలర్గా పేరున్న ఈ యువ ఆటగాడు జాతీయ జట్టులో మాత్రం రాణించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ పర్యటనకు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో ఉమ్రాన్ను తీసుకోవాలని పలువురు సీనియర్లు సూచించారు. అయితే, మహమ్మద్ షమీ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా