World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు సంజూ శాంసన్ (Sanju Samson)ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వికెట్కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్లో చోటుదక్కలేదు. దీంతో సెలక్టర్లను విమర్శిస్తూ సంజూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశంపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) స్పందించాడు. సంజూను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. సంజూ తనకు అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాలని సూచించాడు.
‘‘సంజూ శాంసన్ని జట్టు నుంచి తప్పించడం విస్తృత చర్చకు దారితీసింది. వన్డేల్లో సగటు 55 ఉన్నా ఆ ఆటగాడు ఇప్పటికీ జట్టులో భాగం కాకపోవడం వింతగానే ఉంది. కానీ, భారత జట్టులో ఇప్పటికే ఇద్దరు వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఉండటంతో సంజూను ఎంపిక చేయలేదని నేను భావిస్తున్నా. ఇలా జరగడం వల్ల నిరుత్సాహపడతారని నాకు తెలుసు. కానీ, సంజూ తన అవకాశం కోసం వేచి చూడాలి. అతను యువకుడు. ఎంతో సమయం ఉంది. ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగాలి. కేఎల్ రాహుల్, సంజూ శాంసన్లలో నేను రాహుల్ వైపు మొగ్గు చూపుతాను. అతను నాలుగు, ఐదు స్థానాల్లో నిలకడగా ఆడుతున్నాడు. శాంసన్ కూడా మంచి ఆటగాడు, సిక్సర్లు కొట్టగలడు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక జట్టులో ముగ్గురు వికెట్కీపర్లను ఉంచలేం. వారందరికీ తుదిజట్టులో చోటు కల్పించడం చాలా కష్టం’’ అని హర్భజన్ వివరించాడు. ఇదిలా ఉండగా, ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా.. సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తలపడనుంది. తొలి వన్డే మొహాలీ వేదికగా జరగనుంది.
‘శుభ్మన్ గిల్ తదుపరి కోహ్లీ కావాలనుకుంటున్నాడు.. ప్రపంచకప్లో దంచికొడతాడు’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి