100 ఏళ్ల ఒలింపిక్ ఛాంపియన్
ప్రస్తుతం జీవించి ఉన్న ఒలింపిక్ ఛాంపియన్లలో అత్యధిక వయసు కలిగిన అథ్లెట్గా కొనసాగుతున్న ఆగ్నెస్ కెలెటీ జీవితంలో మరో మైలురాయిని చేరుకుంది...
బుడాపెస్ట్: ప్రస్తుతం జీవించి ఉన్న ఒలింపిక్ ఛాంపియన్లలో అత్యధిక వయసు కలిగిన అథ్లెట్గా కొనసాగుతున్న ఆగ్నెస్ కెలెటీ జీవితంలో మరో మైలురాయిని చేరుకుంది. హంగేరీకి చెందిన ఈ మాజీ జిమ్నాస్ట్ శనివారం వందో పుట్టినరోజు వేడుకలు చేసుకుంది. తన కెరీర్లో అయిదు స్వర్ణాలతో సహా మొత్తం పది ఒలింపిక్స్ పతకాలు సాధించిన ఆమె.. తన జీవితంలోని సంతోషాలు, బాధలు, ఘనతలను ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకుంది. ‘‘ఈ వందేళ్లు నాకు 60 సంవత్సరాల్లాగే అనిపిస్తోంది’’ అని చెప్పిన ఆమె.. తన జీవితం గురించి వచ్చిన కొత్త పుస్తకం ‘‘ది క్వీన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్: 100 ఇయర్స్ ఆఫ్ ఆగ్నెస్ కెలెటీ’’ పై మాట్లాడింది. ‘‘జిమ్నాస్టిక్స్ రాణిగా తనను పేర్కొనడం అతిశయోక్తి మాత్రమే. నేను జీవితాన్ని ప్రేమిస్తా. ఆరోగ్యం చాలా ముఖ్యం. అది లేకుంటే ఏమీ లేనట్టే. ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది కాబట్టి జిమ్నాస్టిక్స్ను ఇష్టపడేదాన్ని. ఇప్పటికీ నేను మంచి ఆరోగ్యంతోనే ఉండడం గొప్పగా ఉంది’’ అని ఆమె పేర్కొంది. 1921లో జన్మించిన ఆమె.. చిన్నతనం నుంచే జిమ్మాస్టిక్స్పై ఆసక్తి పెంచుకుంది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944 ఒలింపిక్స్ వాయిదా పడడంతో ఆమె కెరీర్కు అంతరాయం ఏర్పడింది. 31 ఏళ్ల వయసులో 1952 హెల్సింకీ ఒలింపిక్స్లో పాల్గొని ఓ స్వర్ణం, రజతంతో పాటు రెండు కాంస్యాలు గెలిచింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో ఆరు పతకాలతో చరిత్ర సృష్టించింది.
ఇవీ చదవండి..
ఇంతకన్నా బాగా ఆడలేను: పుజారా
నయావాల్.. డీకోడెడ్!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా