Team India- WTC Final: ఆసీస్ను వెనక్కినెట్టి టెస్టుల్లో నంబర్ వన్గా టీమ్ఇండియా
డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు టీమ్ఇండియా (Team India)కు గుడ్ న్యూస్. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆసీస్ను వెనక్కినెట్టి భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
దిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final) ముంగిట టీమ్ఇండియాకు గుడ్న్యూస్. ఐసీసీ (ICC)తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో గత 15 నెలల నుంచి టాప్లో ఉన్న ఆస్ట్రేలియా (Australia)ను వెనక్కి నెట్టి భారత్ (Team India) అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా.. 2-1 తేడాతో గెల్చుకుని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ తాజాగా వార్షిక ర్యాంకింగ్స్ను అప్డేట్ చేసింది. దీని ప్రకారం 121 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలవగా.. 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానం దక్కించుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. జూన్ 7-11 తేదీల్లో లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ మ్యాచ్ ఫలితం తేలకుంటే 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం బీసీసీఐ ఇటీవల భారత్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరికి గాయాలు.. ఆందోళనలో టీమ్ఇండియా
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే భారత జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, జయ్దేవ్ ఉనద్కత్ గాయాలపాలయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్లో డుప్లెసిస్ షాట్ను అడ్డుకునే క్రమంలో రాహుల్ కుడి తొడకు గాయమవగా.. ఈ మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో ఉనద్కత్ బౌలింగ్ చేస్తూ కిందపడటంతో ఎడమ భుజానికి గాయమైంది. ఈ రెండు గాయాలు తీవ్రంగానే కనిపిస్తుండడం టీమ్ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ గాయాలతో వీళ్లిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైతే యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్లకు జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జైస్వాల్ను కాదనుకుంటే ఇషాన్కిషన్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరిని చేర్చే ఛాన్స్ ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ఇదే :
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్