icc: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు మొదటిస్థానం!

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది

Published : 26 Sep 2022 23:40 IST

దిల్లీ:  ఆస్ట్రేలియాను ఓడించి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియాకు ఐసీసీ మరో శుభవార్తను వినిపించింది. తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచి తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. 

హోరాహోరీ పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 268 పాయింట్లతో భారత్‌ మొదటి స్థానాన్ని పొందింది. ఏడు పాయింట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను వెనక్కు నెట్టింది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయంపాలైన ఆ దేశం 261 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలకు పరిమితమయ్యాయి. మరోవైపు టీమ్‌ఇండియా చేతిలో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా 250 పాయింట్లకు పడిపోయి ఆరో ర్యాంకు దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ఇదే ఉత్సాహంతో జట్టు ముందుకు సాగితే ఆస్ట్రేలియాతో టీ20 ప్రపంచకప్‌నకు ముందు తన ర్యాంక్‌ను పదిలపరుచుకునే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని