Cricket News: పాక్లోనూ గిల్ను వెతికేశారు.. బాబర్కు అక్రమ్ సూచన ఇదే.. రిజ్వాన్ లేకుండానే..!
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ సెర్చ్ వివరాలు ఇప్పటికే విడుదలయ్యాయి. పాకిస్థాన్లో దిగ్గజాలను కాదని.. ఓ భారత యువ ఆటగాడి గురించే అక్కడి అభిమానులు అధికంగా శోధించారు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్కు అక్రమ్ కీలక సూచన చేశాడట.. ఆసీస్తో తొలి టెస్టు ఫైనల్ XIలో రిజ్వాన్కు చోటు దక్కలేదు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
కోహ్లీ, బాబర్ను కాదని.. గిల్ కోసం శోధన
పాకిస్థాన్లో ‘గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ 2023’లో ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ లేడు. ఇక పాతికేళ్ల గూగుల్ చరిత్రలో అత్యధికంగా శోధించిన క్రికెటర్గా (Most Searched Cricketer) విరాట్ కోహ్లీ నిలిచాడు. కానీ, ఈ ఏడాది జాబితాలో మాత్రం శుభ్మన్ గిల్ (Shubman Gill) 8వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్లోనూ అతడి కోసం ఎక్కువ మందే వెతికినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాక్ క్రికెటర్లు అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్, హసీబుల్లా ఖాన్, ఉస్మాన్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గురించి కూడా పాక్ అభిమానులు ఎక్కువగానే వెతికారు.
టీ20 లీగుల్లో కెప్టెన్సీ చేపట్టద్దొని బాబర్కు చెప్పా: అక్రమ్
వన్డే ప్రపంచ కప్లో పాకిస్థాన్ దారుణమైన ఆటతీరుతో విమర్శలపాలై అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి బాబర్ అజామ్ (Babar Azam) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో టీ20లకు షహీన్ను, టెస్టులకు షాన్ మసూద్ను జట్టు యాజమాన్యం సారథులుగా నియమించింది. ఈ క్రమంలో కొత్త బాబర్ అజామ్ను చూస్తామని భారత మాజీ కెప్టెన్ గంభీర్ వ్యాఖ్యానించగా.. దానికి ప్రతిస్పందిస్తూ పాక్ దిగ్గజ క్రికెటర్ వసీమ్ అక్రమ్ గతంలో బాబర్కు తాను ఇచ్చిన సలహాను వెల్లడించాడు. ‘‘తప్పకుండా మనం చూడొచ్చు. రెండేళ్ల కిందటే బాబర్ అజామ్కు ఓ సూచన చేశా. ‘లీగ్ క్రికెట్లో ఏ జట్టుకూ కెప్టెన్సీ చేయొద్దని చెప్పా. అతడు స్టార్ ప్లేయర్. నీకు వచ్చే డబ్బు తీసుకో. నీ ఆట ఆడు. పరుగులు చేయు. హాయిగా విశ్రాంతి తీసుకో. తర్వాత టోర్నీ కోసం సిద్ధంగా ఉండు’ అని సూచించాను. ఎందుకంటే పాక్ జట్టుకు కెప్టెన్సీ చేయడం మంచిదే. కానీ, లీగ్లో జట్టుకు సారథ్యం వహించడమంటే అదనపు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అక్రమ్ తెలిపాడు.
‘ఇప్పటికైనా పాక్ క్రికెట్ను అపహాస్యం చేయడం మానేయండి’
ఆసీస్తో జరుగుతున్న తొలి టెస్టుకు పాకిస్థాన్ (AUS vs PAK) తుది జట్టులో స్టార్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్కు చోటు దక్కలేదు. ఈ ఏడాది కివీస్తో టెస్టు సిరీస్లో అద్భుతంగా ఆడిన రిజ్వాన్ను పక్కన పెట్టడంపై అక్కడి క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పించారు. రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ను వికెట్ కీపర్గా పాక్ మేనేజ్మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా పాక్ క్రికెట్ మేనేజ్మెంట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.
‘‘ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి. పాక్ క్రికెట్ను అపహాస్యం చేయకండి’’
‘‘ఇదో చెత్త ఎంపిక. రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ను ఎలా ఎంపిక చేస్తారు? పాకిస్థాన్ క్రికెట్ పరువు తీయకండి’’
‘‘ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లపై రాణించినా రిజ్వాన్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!