Team India: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియాకు ముఖ్య ఆటగాళ్లెవరో అందరికీ తెలుసు: సంగక్కర
రానున్న వన్డే ప్రపంచకప్ టీమ్ఇండియా ప్రధాన ఆటగాళ్లు ఎక్కువ దృష్టిపెట్టాలని శ్రీలంక మాజీ ఆటగాడు సంగక్కర సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య 2023 వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టు ఎంపిక గురించి బీసీసీఐ (BCCI) ఇప్పటి నుంచే కసరత్తు మొదలెట్టింది. 20 మంది ఆటగాళ్లతో కూడిన షార్ట్లిస్ట్ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా (Team India)కు ప్రధానమైన ఆటగాళ్లెవరో అందరికీ తెలుసని సంగక్కర పేర్కొన్నాడు. ముఖ్య ఆటగాళ్లు తమ దృష్టిని ప్రపంచకప్పైనే కేంద్రీకరించాలని, వన్డే క్రికెట్ ఎక్కువగా ఆడాలని సలహా ఇచ్చాడు. వీరంతా ఫిట్గా ఉంటూ ఆటలో మరింత మెరుగవ్వాలన్నాడు.
‘భారత జట్టులో ప్రధానమైన ఆటగాళ్లెవరో అందరికీ తెలుసు. కాబట్టి.. ఈ ఆటగాళ్ల పనిభార నిర్వహణను చాలా జాగ్రత్తగా చేయాలి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ (IPL) ఉంది. ఇతర సిరీస్లూ ఉన్నాయి. కానీ, ఇది ప్రపంచకప్ సంవత్సరం కావడంతో ఎక్కువ దృష్టి దానిపైనే ఉండాలి. టీమ్ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడాలి. మిగతా వారిని రొటేట్ చేయాలి. కానీ, వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకోవడానికి పోరాడే అవకాశం తమకు కూడా ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రధాన ఆటగాళ్లు ఫిట్నెస్ కాపాడుకుంటూ మరింత నైపుణ్యం సంపాదించాలి. ఇలా చేస్తే భారత్ ప్రపంచ కప్ సాధిస్తుంది. కాబట్టి.. చుట్టూ ఏం జరిగినా వారి ప్రధాన లక్ష్యం ప్రపంచకప్గానే ఉండాలి’ అని సంగక్కర వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..