IPL 2022 Auction: వేలంలో బాధ్యతగా వ్యవహరించిన ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ మెగా వేలంలో తొలి రోజు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించిందని బాలీవుడ్ స్టార్ ప్రీతిజింతా కొనియాడారు...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ మెగా వేలంలో తొలి రోజు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం బాధ్యతగా వ్యవహరించిందని బాలీవుడ్ స్టార్ ప్రీతిజింతా కొనియాడారు. బెంగళూరు వేదికగా ఐపీఎల్-2022 మెగా వేలం శని, ఆదివారాల్లో ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలిరోజు అన్ని జట్ల మాదిరిగానే వేలంలో పాల్గొన్న ముంబయి ఇండియన్స్ సభ్యులు సభలో కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించారు. మరే ఇతర ఫ్రాంఛైజీలు కూడా అలా కనిపించలేదు. దీంతో ఆ ఫొటోను ట్విటర్లో పంచుకున్న పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింతా వేలంలో బాధ్యతగా ఉన్నారంటూ ప్రశంసించారు. అలాగే ముంబయి యజమాని నీతా అంబానీ కళ్లు ఆకర్షణీయంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించాని వ్యాఖ్యానించారు.
ఇక ఈ వేలంలో పంజాబ్ తొలి రోజు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా ఇంకా రూ.28.65 కోట్ల మొత్తం మిగిలి ఉంది. వేలానికి ముందు మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్లను అట్టిపెట్టుకున్న ఆ జట్టు.. శనివారం షారుక్ ఖాన్ (రూ.9 కోట్లు), బెయిర్స్టో (రూ.6.75 కోట్లు), ధావన్ (రూ.8.25 కోట్లు), రబాడ (రూ.9.25 కోట్లు) లాంటి కీలక ఆటగాళ్లను సొంతం చేసుకొంది. ఇక మిగిలిన వారిలో జితేశ్ శర్మ (రూ.20 లక్షలు), హర్ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), ప్రభ్సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు) ఉన్నారు.
మరోవైపు ముంబయి టీమ్ తొలిరోజు తమ పాత ఆటగాడు ఇషాన్ కిషన్ను అత్యధిక ధర రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. మిగిలినవారిలో బాసిల్ థంపి (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్ బ్రేవిస్ (రూ.3 కోట్లు)లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టుతో మిగిలిన మొత్తం రూ.27.85 కోట్లుగా ఉంది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ పొలార్డ్, ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రాలను అట్టి పెట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడు చాలా సేపు బంతిని బౌండరీ దాటించలేకపోయాడు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!