Cricket News: స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే.
ఇంటర్నెట్ డెస్క్: జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ విండీస్ - యూఎస్ఏ వేదికగా జరగనుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం పొట్టి కప్లో ఆడటం అనుమానమే. తన సొంత దేశం విండీస్లో కుటుంబసభ్యుల ఎదుట మ్యాచ్ ఆడదామని ఆశ పడిన అతడికి గాయాలు శాపంగా మారాయి. విండీస్ నుంచి ఆర్చర్ ఇంగ్లాండ్కు వలసొచ్చి క్రికెటర్గా ఎదిగాడు. గత వన్డే ప్రపంచకప్లోనూ అతడిని కేవలం ట్రావెలింగ్ రిజర్వ్గానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే, అతడు ఒక్క మ్యాచ్లోనూ ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటున్న ఆర్చర్ను పాకిస్థాన్తో టీ20 సిరీస్ ఆడించాలని ఈసీబీ భావిస్తోంది. పొట్టి కప్ ముందు జరగబోయే ఆ సిరీస్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు 2021, 2022 ప్రపంచ కప్ల సమయంలోనూ మోచేతి గాయం కారణంగా పాల్గొనలేకపోయాడు.
ముందుగానే రిటైర్మెంట్ కావడానికి కారణమదే: మెగ్ లానింగ్
అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ మహిళా జట్టును అద్వితీయంగా నడిపించిన సారథి మెగ్ లానింగ్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆస్ట్రేలియాకు బంగారు పతకం అందించిన మెగ్ లానింగ్ ఆ తర్వాత ఆటకు ఆరు నెలలపాటు విరామం ఇచ్చింది. మానసిక ఆరోగ్యం కోసం ఓ కాఫీ షాప్లోనూ పని చేసింది. మళ్లీ మైదానంలోకి దిగుతుందని భావించిన వేళ.. సడెన్గా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్లే కావడం గమనార్హం.
‘‘ఆ సమయంలో ప్రతిఒక్కరూ తొందరపడుతున్నావని సూచనలు ఇచ్చారు. నేను మాత్రం క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా లేను. శారీరకంగానూ, మానసికంగా చాలా అలసిపోయా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్కో రోజు కేవలం రెండు పూటలు మాత్రమే తిని వారానికి 90 కి.మీ. పరిగెత్తా. అతిగా ఎక్సర్సైజ్ చేశా. దీంతో అతి తక్కువ రోజుల్లో 64 కేజీల నుంచి 57 కేజీలకు వచ్చేశా. ఆ ప్రభావం ఏంటో ఊహించలేకపోయా. క్రికెట్ ముగిసిన తర్వాత ఏంటి పరిస్థితి? అనే ఆందోళనా ఎక్కువైంది. దీంతో మానసికంగానూ ఇబ్బంది పడ్డా. గతేడాది వరల్డ్ కప్, డబ్ల్యూపీఎల్ మధ్య చాలా ఒంటరిగా ఫీలయ్యా’’ అని లానింగ్ తెలిపింది. సారథిగా మెగ్ లానింగ్ మహిళల ప్రీమియర్ లీగ్లో దిల్లీ జట్టును ఫైనల్కు చేర్చింది. అక్కడ బెంగళూరు చేతిలో దిల్లీ ఓడిపోయింది.
యూఎస్ఏ ప్రధాన కోచ్గా ఆసీస్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ అమెరికా క్రికెట్ జట్టు తన ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఆటగాడిని నియమించుకుంది. స్టువర్ట్ లా ఆసీస్ తరఫున 50కిపైగా మ్యాచ్లు ఆడాడు. 1996 వరల్డ్కప్ ఫైనల్కు చేరిన ఆసీస్ జట్టులోనూ సభ్యుడు. బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ అండర్ -19 జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం అతడి సొంతం. వచ్చే నెలలో బంగ్లాదేశ్తో యూఎస్ఏ మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. ఆ సమయానికి జట్టుతోపాటు స్టువర్ట్లా చేరతాడు. ఈమేరకు యూఎస్ఏ క్రికెట్ అసోసియేషన్ ప్రకటన జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. పెద్దగా ఫామ్లో లేనివారికి అవకాశం ఇచ్చారనే విమర్శలూ వస్తున్నాయి. -
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
రింకూ సింగ్ను టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. 176 స్ట్రైక్రేట్ 86 సగటు ఉన్న ఆటగాడిని ఎలా విస్మరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
భారత జట్టు తరఫున వరల్డ్ కప్ ఆడే అవకాశం సంజూ శాంసన్కు దక్కింది. పొట్టి కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జాబితాలో అతడి పేరుంది. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట