KL Rahul: కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్
కెప్టెన్సీ తనకు కొత్త కాదని, ఇప్పటికే కెప్టెన్గా చాలా మ్యాచ్ల్లో జట్టుకు విజయాలనందించానని టీమ్ఇండియా తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో టీమ్ఇండియా (Team India) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ గైర్హాజరీతో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును విజయ పథంలో నడిపిండమే కాకుండా అర్ధ శతకం (58) బాది బ్యాటర్గానూ అదరగొట్టాడు. మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడాడు. కెప్టెన్సీ తనకు కొత్త కాదని, ఇప్పటికే కెప్టెన్గా చాలా మ్యాచ్ల్లో జట్టుకు విజయాలనందించానని పేర్కొన్నాడు.
‘‘కెప్టెన్గా వ్యవహరించడం ఇది నాకు మొదటిసారేం కాదు. ఇప్పటికే సారథిగా చాలా మ్యాచ్ల్లో జట్టును గెలిపించాను. కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం. సారథిగా జట్టును ఎలా నడిపించాలో అలవాటు పడ్డాను. కొలంబోలో ఆడి వచ్చిన అనుభవంతో ఈ మ్యాచ్ ప్రారంభంలో మైదాన పరిస్థితులు స్వర్గాన్ని తలపించాయి. కానీ, మధ్యాహ్నాం తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాం. మైదానంలో దాన్ని ప్రదర్శించాం. మేం ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. దీంతో ప్రతీ బౌలర్ 10 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి వచ్చింది. క్రీజులో కుదురుకున్న గిల్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ గాడి తప్పినట్లు అనిపించింది. కానీ, సూర్యకుమార్తో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాను. స్ట్రెక్రొటేట్ చేయడం, ఎలాంటి షాట్లు ఆడాలనే దాని గురించి సూర్య, నేను మాట్లాడుకున్నాం. తొందరపడకుండా ఆచితూచి ఆడుకుంటూ మ్యాచ్ ఆఖరి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే రెండో వన్డేకు కూడా కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సెప్టెంబరు 27న జరిగే మూడో వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
వికెట్కీపర్ ఇషాన్కిషన్ చేసిన ఓ తప్పిదం ఆసీస్కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు. -
Jasprit Bumrah: బుమ్రా ‘మౌనం’ ఎందుకు?
బుమ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. -
IND vs AUS: మ్యాక్స్వెల్ ముంచేశాడు
ప్చ్.. పొట్టి సిరీస్లో భారత్కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్వెల్ విధ్వంసక బ్యాటింగ్తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ruturaj gaikwad: అదే రోజు.. అదే బాదుడు
నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్ప్రదేశ్పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్లు, 10 ఫోర్లు ఉన్నాయి. -
ముకేశ్కు పెళ్లి కళ
భారత పేసర్ ముకేశ్ కుమార్ పెళ్లి కొడుకయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఆడని అతడు గోరఖ్పుర్లో తన వివాహ వేడుక కోసం బీసీసీఐ అనుమతి తీసుకుని వెళ్లాడు. -
టీ20 ప్రపంచకప్కు నమీబియా
2024 టీ20 ప్రపంచకప్కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరఫున పొట్టి కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియాపై విజయం సాధించింది. -
ఆసీస్ జట్టులో అనేక మార్పులు
భారత్తో టీ20 సిరీస్లో ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టులో అనేక మార్పులు జరిగాయి. చివరి రెండు మ్యాచ్లకు ముందు దాదాపు సగం ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోనుంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ మాత్రమే మిగిలిన రెండు టీ20ల కోసం భారత్లో ఉంటాడు. -
రాణించిన హసన్జాయ్
హసన్జాయ్ (86; 166 బంతుల్లో 11×4) రాణించడంతో న్యూజిలాండ్తో తొలి టెస్టులో బంగ్లా మొదటిరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్లో 310/9 స్కోరు చేసింది. తైజుల్ (8), షోరిఫుల్ (13) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను హసన్ జాయ్ నడిపించాడు. -
అమ్మాయిలకు పరీక్ష
భారత మహిళల ‘ఏ’ జట్టుకు పరీక్ష. బుధవారం ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడనుంది. మిన్ను మణి సారథ్యంలోని టీమ్ఇండియాలో ప్రతిభావంతులకు కొదువ లేదు. తెలుగమ్మాయిలు జి.త్రిష, బారెడ్డి అనూషలకు సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశం. -
త్వరలోనే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు
-
అదనపు పరిహారానికి పీసీబీ డిమాండ్
తమకు అదనపు పరిహారం చెల్లించాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)ను పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఆసియా కప్ సమయంలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు గాను అదనపు పరిహారం ఇవ్వాలని కోరుతోంది. -
ఐపీఎల్ ఆడాలని ఉంది
ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి ఆటగాడు ఐపీఎల్కు రావాలని అనుకుంటారు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది పెద్ద లీగ్. భవిష్యత్లో అవకాశం వస్తే కచ్చితంగా ఆడతా’’ అని హసన్ అలీ చెప్పాడు. -
కోచ్గా ద్రవిడే..!
టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? -
Kapil Dev: ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు
ఎక్కువ ఆశలు పెట్టుకోవడం చేటు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. అభిమానులు అధిక ఒత్తిడి తెచ్చుకోవద్దని.. క్రికెట్ను ఒక క్రీడగా మాత్రమే పరిగణించాలని సూచించాడు. ‘‘ఎక్కువ ఆశలు పెట్టుకుంటే హృదయాలు ముక్కలవుతాయి. -
శీతల్ నం.1
రెండు చేతులు లేకపోయినా కాళ్ల సాయంతో విల్లును పట్టుకుని గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తున్న భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మరో ఘనత సాధించింది. మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో ఆమె రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నంబర్వన్గా నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు